Political News

అది కుంత‌ల రాజ్యం.. ఇది గుంత‌ల రాజ్యం: నారా లోకేష్

ఏపీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రోసారి పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “బాహుబ‌లి సినిమాలో కుంత‌ల రాజ్యం చూశాం.. ఇప్పుడు ఏపీలో గుంత‌ల రాజ్యం చూస్తున్నాం ” అని పంచ్‌లు పేల్చారు. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారా లోకేష్ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలో కీల‌క వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రావు నియోక‌వ‌ర్గం ఒంగోలులో స‌భ నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో నారా లోకేష్ త‌న‌దైన శైలిలో పంచ్‌లు పేల్చారు. బాహుబ‌లి సినిమాలో కుంతల రాజ్యం చూశామ‌ని.. జ‌గ‌న‌న్న పాల‌న‌లో గుంతల రాజ్యం చూస్తున్నామ‌ని.. అన్నారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా న‌వ్వులు విర‌బూశాయి. “జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారు” అని నారా లోకేష్ విమర్శించారు. “జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక అద్భుతమైన కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌. జగన్‌ దగ్గర రెండు బటన్లు ఉంటాయి.. బల్లపైన బ్లూ బటన్‌, బల్లకింద రెడ్‌ బటన్‌” అని వ్యాఖ్యానించారు.

దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగనేన‌ని నారా లోకేష్ అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు మహిళలకు జగన్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమ‌ర్శించారు. మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తాను తీసుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెట్టింపయ్యింద‌ని, పెరిగిన సొమ్ము ఎవ‌రి ఖాతాలోకి వెళ్తోందో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు.

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని నారా లోకేష్ అన్నారు. కులాల‌ను మ‌భ్య పెట్టేందుకు నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, క‌నీసం కూర్చునేందుకు కూడా కుర్చీలేకుండా అవ‌మానించార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. బడుగు, బలహీన వర్గాలంటే సీఎం జగన్‌కు చిన్నచూప‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేదలకు సీఎం జగన్‌ చేసిందేమీ లేదన్నారు. పేదలకిచ్చిన 3 లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కున్నారని విమ‌ర్శించారు. చంద్రబాబు హయాంలో 3లక్షల ఇళ్లు పూర్తి చేశామ‌న్నారు. 3లక్షల ఇళ్లు కట్టాలంటే జగన్‌ వంద జన్మలు ఎత్తాల‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on July 26, 2023 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

58 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

1 hour ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

5 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

7 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

8 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

10 hours ago