ఏపీ సర్కారుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా మరోసారి పంచ్లతో విరుచుకుపడ్డారు. “బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం.. ఇప్పుడు ఏపీలో గుంతల రాజ్యం చూస్తున్నాం ” అని పంచ్లు పేల్చారు. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో కీలక వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు నియోకవర్గం ఒంగోలులో సభ నిర్వహించారు.
ఈ సభలో నారా లోకేష్ తనదైన శైలిలో పంచ్లు పేల్చారు. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశామని.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని.. అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. “జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారు” అని నారా లోకేష్ విమర్శించారు. “జగన్కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. జగన్ దగ్గర రెండు బటన్లు ఉంటాయి.. బల్లపైన బ్లూ బటన్, బల్లకింద రెడ్ బటన్” అని వ్యాఖ్యానించారు.
దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనేనని నారా లోకేష్ అన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు జగన్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తాను తీసుకుంటానని ఈ సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెట్టింపయ్యిందని, పెరిగిన సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్తోందో చెప్పాలని ఆయన నిలదీశారు.
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని నారా లోకేష్ అన్నారు. కులాలను మభ్య పెట్టేందుకు నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలేకుండా అవమానించారని విమర్శలు గుప్పించారు. బడుగు, బలహీన వర్గాలంటే సీఎం జగన్కు చిన్నచూపని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సీఎం జగన్ చేసిందేమీ లేదన్నారు. పేదలకిచ్చిన 3 లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో 3లక్షల ఇళ్లు పూర్తి చేశామన్నారు. 3లక్షల ఇళ్లు కట్టాలంటే జగన్ వంద జన్మలు ఎత్తాలని దుయ్యబట్టారు.
This post was last modified on July 26, 2023 10:23 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…