Political News

సీబీఐకి ఇంగిత జ్ఞానం లేదు: సజ్జల

వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ సునీత ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ నేతలే వివేకా హత్యకు పాల్పడ్డారని మీడియాకు చెప్పాలంటూ సజ్జల తనకు సూచించారని సునీత చెప్పిన వైనం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే సునీత వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.

సునీత ఇంటికి భారతితో కలిసి తాను వెళ్ళలేదనీ, తన భార్యతో కలిసి వెళ్లి సునీతను పరామర్శించానని చెప్పారు. సునీతను ప్రెస్ మీట్ పెట్టమని, అవినాశ్ ను డిఫెండ్ చేయమని తాను చెప్పలేదని సజ్జల అన్నారు. వివేకా కేసులో టీడీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీబీఐ చెత్తగా విచారణ చేస్తుందనడానికి వివేకా కేసు ఉదాహరణ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు వివేకా చనిపోతే నష్టపోయేది వైసీపీ అని, అది చంద్రబాబుకు ఉపయోగం అని ఆరోపించారు.

ఈ ఇంగిత జ్ఞానం సీబీఐకి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, టీడీపీ కోణాన్ని సీబీఐ పట్టించుకోలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. అన్ని వ్యవస్థల్లో చంద్రబాబు వైరస్ మాదిరి పాకిపోయాడని, వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని ఆరోపించారు. కథలో మలుపులకు తగ్గట్లు సునీత అదనపు సమాచారం ఇస్తూనే ఉన్నారని, గూగుల్‌ టేక్‌ అవుట్‌ విచారణకు పనికి రాదని సీబీఐకి ఇప్పుడు అర్థమైందని సజ్జల అన్నారు.

This post was last modified on July 26, 2023 8:37 am

Share
Show comments

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

15 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

50 minutes ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago