Political News

గరం గరంగా గన్నవరం వైసీపీ

ఏపీ రాజకీయాలలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వైసీపీపై ఒంటికాలి మీద లేచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి…ఆ తర్వాత వైసీపీకి మద్దతిచ్చారు. అయితే, 2019లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు…వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. వంశీ వైసీపీకి మద్దతిచ్చేనాటికి గన్నవరంలో వైసీపీ కీలకనేతగా ఆయన కొనసాగుతున్నారు. అయితే, వంశీ రాకతో గన్నవరం వైసీపీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఆల్రెడీ వైరి వర్గాలుగా ఉన్న వంశీ, వెంకట్రావులు రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదంటే తనదని స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు.

అయితే, జగన్ మాత్రం వల్లభనేని వంశీకే గన్నవరం టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. దీంతో, వెంకట్రావు కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియా ప్రతినిధులతో వెంకట్రావు చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానంటూ వెంకట్రావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీనిచ్చారు. తాను అమెరికా వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రారావుతో భేటీ అయిన వెంకట్రావు ఆ తర్వాత ఈ కామెంట్లు చేశారు.

తాను అజ్ఞాతవాసంలో ఉన్నానని, రెండేళ్లుగా కొన్ని రాజకీయ ఇబ్బందుల వల్ల కార్యకర్తలకు ఏం చేయలేకపోయానని వెంకట్రావు వాపోయారు. అయితే, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేస్తారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్రావు పార్టీ వీడబోతున్నారని, టీడీపీ లేదా జనసేన తరఫున బరిలోకి దిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే, వంశీపై టీడీపీ నేత పట్టాభిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోందని కూడా పుకార్లు వస్తున్నాయి.

This post was last modified on July 24, 2023 9:59 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

57 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago