Political News

ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు ప‌వ‌న్ వెల్ల‌డి

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా బుధ‌వారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అమిత్ షా కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని తెలిసింది. ముఖ్యంగా ఇటీవ‌ల తాను చేప‌ట్టిన వారాహి యాత్ర 1.0, 2.0ల గురించి వివ‌రించార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయా యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీడియోలు స‌హా వివ‌రించార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నార‌ని ఈ విష‌యం త‌న స‌భ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల ద్వారా తాను నేరుగా విన్నాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో కేంద్రం ఇస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌ని, అస‌లు ఆ నిధులు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌డం లేద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తిప‌క్షాల‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా కేసులు పెడుతున్నార‌ని.. క‌నీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌ని, రాజ్యాంగాన్ని కాద‌ని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యం కూడా ప‌వ‌న్‌-అమిత్‌షాల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయితే.. ప్ర‌స్తుతం త‌మ దృష్టి తెలంగాణ‌, రాజ‌స్తాన్‌ల‌పై ఉంద‌ని.. త్వ‌ర‌లోనే మ‌రోసారి క‌లిసి మాట్లాడుదామ‌ని అమిత్ షా చెప్పిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. అమిత్ షాతో భేటీకి సంబందించి ప‌వ‌న్ ట్వీట్ చేశారు. “హోంమంత్రి ‘అమిత్ షా జీ’తో అద్భుతమైన సమావేశం జరిగింది. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా” అని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

This post was last modified on July 20, 2023 8:29 am

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

22 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago