Political News

ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు ప‌వ‌న్ వెల్ల‌డి

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా బుధ‌వారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అమిత్ షా కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని తెలిసింది. ముఖ్యంగా ఇటీవ‌ల తాను చేప‌ట్టిన వారాహి యాత్ర 1.0, 2.0ల గురించి వివ‌రించార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయా యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీడియోలు స‌హా వివ‌రించార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నార‌ని ఈ విష‌యం త‌న స‌భ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల ద్వారా తాను నేరుగా విన్నాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో కేంద్రం ఇస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌ని, అస‌లు ఆ నిధులు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌డం లేద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తిప‌క్షాల‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా కేసులు పెడుతున్నార‌ని.. క‌నీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌ని, రాజ్యాంగాన్ని కాద‌ని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యం కూడా ప‌వ‌న్‌-అమిత్‌షాల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయితే.. ప్ర‌స్తుతం త‌మ దృష్టి తెలంగాణ‌, రాజ‌స్తాన్‌ల‌పై ఉంద‌ని.. త్వ‌ర‌లోనే మ‌రోసారి క‌లిసి మాట్లాడుదామ‌ని అమిత్ షా చెప్పిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. అమిత్ షాతో భేటీకి సంబందించి ప‌వ‌న్ ట్వీట్ చేశారు. “హోంమంత్రి ‘అమిత్ షా జీ’తో అద్భుతమైన సమావేశం జరిగింది. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా” అని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

This post was last modified on July 20, 2023 8:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

4 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

5 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago