Political News

ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు ప‌వ‌న్ వెల్ల‌డి

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా బుధ‌వారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అమిత్ షా కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని తెలిసింది. ముఖ్యంగా ఇటీవ‌ల తాను చేప‌ట్టిన వారాహి యాత్ర 1.0, 2.0ల గురించి వివ‌రించార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయా యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీడియోలు స‌హా వివ‌రించార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నార‌ని ఈ విష‌యం త‌న స‌భ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల ద్వారా తాను నేరుగా విన్నాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో కేంద్రం ఇస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌ని, అస‌లు ఆ నిధులు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌డం లేద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తిప‌క్షాల‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా కేసులు పెడుతున్నార‌ని.. క‌నీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌ని, రాజ్యాంగాన్ని కాద‌ని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యం కూడా ప‌వ‌న్‌-అమిత్‌షాల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయితే.. ప్ర‌స్తుతం త‌మ దృష్టి తెలంగాణ‌, రాజ‌స్తాన్‌ల‌పై ఉంద‌ని.. త్వ‌ర‌లోనే మ‌రోసారి క‌లిసి మాట్లాడుదామ‌ని అమిత్ షా చెప్పిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. అమిత్ షాతో భేటీకి సంబందించి ప‌వ‌న్ ట్వీట్ చేశారు. “హోంమంత్రి ‘అమిత్ షా జీ’తో అద్భుతమైన సమావేశం జరిగింది. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా” అని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

This post was last modified on July 20, 2023 8:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

25 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

49 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago