ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా బుధవారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను పవన్ కళ్యాణ్.. అమిత్ షా కు పూసగుచ్చినట్టు వివరించారని తెలిసింది. ముఖ్యంగా ఇటీవల తాను చేపట్టిన వారాహి యాత్ర 1.0, 2.0ల గురించి వివరించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయా యాత్రలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను పవన్ కళ్యాణ్ వీడియోలు సహా వివరించారని తెలిసింది. ప్రస్తుతం ఏపీ ప్రజలు మార్పు కోరుతున్నారని ఈ విషయం తన సభలకు వచ్చిన ప్రజల ద్వారా తాను నేరుగా విన్నానని చెప్పారు. అదేసమయంలో కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, అసలు ఆ నిధులు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదని వివరించినట్టు సమాచారం. ప్రతిపక్షాలపై పోలీసులు అనవసరంగా కేసులు పెడుతున్నారని.. కనీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని, రాజ్యాంగాన్ని కాదని వ్యవహరిస్తున్నారని పవన్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఇక, వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయం కూడా పవన్-అమిత్షాల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే.. ప్రస్తుతం తమ దృష్టి తెలంగాణ, రాజస్తాన్లపై ఉందని.. త్వరలోనే మరోసారి కలిసి మాట్లాడుదామని అమిత్ షా చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. అమిత్ షాతో భేటీకి సంబందించి పవన్ ట్వీట్ చేశారు. “హోంమంత్రి ‘అమిత్ షా జీ’తో అద్భుతమైన సమావేశం జరిగింది. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా” అని పవన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
This post was last modified on July 20, 2023 8:29 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…