తరచూ వార్తల్లో ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నోట ఒక ఆసక్తికర అంశం రివీల్ అయ్యింది. నిత్యం రాజకీయం.. తన రాజకీయ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాల్ని పెద్దగా ప్రస్తావించని ఆయన.. తాజాగా మాత్రం తన మనమడి పేరేమిటో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో కొందరు రెడ్ల కారణంగా ప్రభుత్వానికి.. ఆ కులానికి చెడ్డపేరు వస్తోందన్న ఆయన.. రెడ్లు అంటే తనకు అత్యంత గౌరవమని వ్యాఖ్యానించారు. ఇక.. జగన్మోహన్ రెడ్డి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే తనకెంతో గౌరవంగా వెల్లడించారు. ఈ కారణంతోనే తన మనమడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ మీద తనకున్న అభిమానానికి అదో నిదర్శనమన్న ఆయన.. ప్రభుత్వం ఒక కులం కోసం పని చేస్తుందన్న బావనను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.
గతంలో తాము ఇదే ఫీలింగ్ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచామన్న ఆయన.. ఇప్పుడేమో ఎవరూ తీసుకురాకుండానే ఆ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసిందన్నారు. ఓట్లు వేసే దాకా అన్ని కులాలు.. ఓట్లు వేసిన తర్వాత ఒక కులం అనేది సరికాదన్నారు. జగన్ కు కులం ఫీలింగ్ లేదన్న ఆయన.. అలాంటి ఫీలింగ్ ఉన్న వారు మాత్రం పార్టీలో ఉన్నారన్నారు. ఏమైనా.. ఎంత అభిమానమైనా.. వైఎస్ పేరును రెడ్డితో సహా పెట్టుకోవటం చూస్తే.. రఘు రామకు ఆయనెంత అభిమామన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
This post was last modified on August 14, 2020 7:21 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…