Political News

రఘురామ రాజు మనమడి పేరు తెలుసా?

తరచూ వార్తల్లో ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నోట ఒక ఆసక్తికర అంశం రివీల్ అయ్యింది. నిత్యం రాజకీయం.. తన రాజకీయ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాల్ని పెద్దగా ప్రస్తావించని ఆయన.. తాజాగా మాత్రం తన మనమడి పేరేమిటో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో కొందరు రెడ్ల కారణంగా ప్రభుత్వానికి.. ఆ కులానికి చెడ్డపేరు వస్తోందన్న ఆయన.. రెడ్లు అంటే తనకు అత్యంత గౌరవమని వ్యాఖ్యానించారు. ఇక.. జగన్మోహన్ రెడ్డి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే తనకెంతో గౌరవంగా వెల్లడించారు. ఈ కారణంతోనే తన మనమడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ మీద తనకున్న అభిమానానికి అదో నిదర్శనమన్న ఆయన.. ప్రభుత్వం ఒక కులం కోసం పని చేస్తుందన్న బావనను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.

గతంలో తాము ఇదే ఫీలింగ్ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచామన్న ఆయన.. ఇప్పుడేమో ఎవరూ తీసుకురాకుండానే ఆ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసిందన్నారు. ఓట్లు వేసే దాకా అన్ని కులాలు.. ఓట్లు వేసిన తర్వాత ఒక కులం అనేది సరికాదన్నారు. జగన్ కు కులం ఫీలింగ్ లేదన్న ఆయన.. అలాంటి ఫీలింగ్ ఉన్న వారు మాత్రం పార్టీలో ఉన్నారన్నారు. ఏమైనా.. ఎంత అభిమానమైనా.. వైఎస్ పేరును రెడ్డితో సహా పెట్టుకోవటం చూస్తే.. రఘు రామకు ఆయనెంత అభిమామన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

This post was last modified on August 14, 2020 7:21 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

19 minutes ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

1 hour ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

2 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

2 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

5 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

5 hours ago