తరచూ వార్తల్లో ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నోట ఒక ఆసక్తికర అంశం రివీల్ అయ్యింది. నిత్యం రాజకీయం.. తన రాజకీయ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాల్ని పెద్దగా ప్రస్తావించని ఆయన.. తాజాగా మాత్రం తన మనమడి పేరేమిటో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో కొందరు రెడ్ల కారణంగా ప్రభుత్వానికి.. ఆ కులానికి చెడ్డపేరు వస్తోందన్న ఆయన.. రెడ్లు అంటే తనకు అత్యంత గౌరవమని వ్యాఖ్యానించారు. ఇక.. జగన్మోహన్ రెడ్డి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే తనకెంతో గౌరవంగా వెల్లడించారు. ఈ కారణంతోనే తన మనమడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ మీద తనకున్న అభిమానానికి అదో నిదర్శనమన్న ఆయన.. ప్రభుత్వం ఒక కులం కోసం పని చేస్తుందన్న బావనను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.
గతంలో తాము ఇదే ఫీలింగ్ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచామన్న ఆయన.. ఇప్పుడేమో ఎవరూ తీసుకురాకుండానే ఆ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసిందన్నారు. ఓట్లు వేసే దాకా అన్ని కులాలు.. ఓట్లు వేసిన తర్వాత ఒక కులం అనేది సరికాదన్నారు. జగన్ కు కులం ఫీలింగ్ లేదన్న ఆయన.. అలాంటి ఫీలింగ్ ఉన్న వారు మాత్రం పార్టీలో ఉన్నారన్నారు. ఏమైనా.. ఎంత అభిమానమైనా.. వైఎస్ పేరును రెడ్డితో సహా పెట్టుకోవటం చూస్తే.. రఘు రామకు ఆయనెంత అభిమామన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
This post was last modified on August 14, 2020 7:21 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…