Political News

హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మా నినాదం: ప‌వ‌న్‌

“బుగ్గ‌లు నిమిరేవారిని.. త‌ల‌పై చెయ్యి పెట్టేవారిని న‌మ్మారు. ఇప్పుడు ఏమైంది. అలాంటివారిని న‌మ్మ‌డం కాదు.. మాట‌పై నిల‌బ‌డేవారిని న‌మ్మండి. వారికి ఓటేయండి!” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి 2.0 యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఏలూరులో ఆదివారం రాత్రి నిర్వ‌హించిన స‌భ‌లో వైసీపీ స‌ర్కారుపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా మారాలంటూ హిత‌వు ప‌లికారు. మాయ మాట‌లు చెప్పి.. బుగ్గ‌లునిమిరే వారికి ఓటు వేయొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

“రాజకీయాల్లో విలువలు నిలబెట్టేలా నేను మాట్లాడుతుంటే అధికార పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. న‌న్ను వ్యక్తిగతంగా దూషిస్తూ.. నా కుటుంబంపై అన‌రాని మాట‌లు అంటున్నారు. జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. జగన్‌ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను. కానీ.. ఇప్పటి నుంచి నేను ఏంటో చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది వైసీపీ నేత‌ల‌కు” అని ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమ‌న్న ప‌వ‌న్‌.. విద్య, వైద్యం, ఉపాధి కల్పించే వరకు ప్రజలకు అండగా ఉంటామ‌ని చెప్పారు. కొల్లేరు కలుషితమవుతోందని, సంరక్షించే బాధ్యత తాము తీసుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. 115 ఏళ్లనాటి కృష్ణా జ్యూట్‌మిల్లు వైసీపీ పాల‌న‌లో మూత‌బ‌డింద‌ని విమ‌ర్శించారు.

ఆ యువ‌తులు ఏమ‌య్యారు?
రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని ప‌వ‌న్ అన్నారు. ముఖ్యంగా 30 వేల మంది యువ‌తులు నాలుగేళ్ల‌లో అదృశ్య‌మ‌య్యార‌ని.. మానవ అక్రమ రవాణాకు కారణం.. వైసీపీ వ‌లంటీరు వ్యవస్తేన‌ని వ్యాఖ్యానించారు ఇందులో వైసీపీ నేతల పాత్ర ఉందని నిఘా వర్గాలే చెప్పాయన్నారు. యువతుల అదృశ్యంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదని ప్ర‌శ్నించారు. సీఎం సహా ఒక్కో ఎమ్మెల్యే వందల కోట్లు దోచేస్తున్నారని మండిప‌డ్డారు.

“హలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే త‌మ‌ నినాదమ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్‌ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. పదవి నుంచి దిగిపోగానే జగన్‌ను వాడవాడలా వెంటాడతామ‌ని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం మారాలని చెప్పారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

This post was last modified on July 10, 2023 8:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago