Political News

20 ఏళ్ల త‌ర్వాత‌.. టీడీపీ ప‌క్కాగా గెలిచే సీటు అదేన‌ట‌

తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం చూపించే నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌. ఇక్క‌డ బాబా యి-అబ్బాయిల మ‌ధ్యే పోరు సాగుతోంది. ఒక‌రు వైసీపీలో ఉంటే.. మ‌రొక‌రు టీడీపీలో చ‌క్రం తిప్పుతున్నా రు. వారే జ్యోతుల ఫ్యామిలీకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. జ్యోతుల నెహ్రూ. గ‌త ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ త‌ల‌ప‌డ్డారు. అయితే, బాబాయి నెహ్రూ పై అబ్బాయి చంటి విజ‌యం ద‌క్కించుకుని వైసీపీ జెండా ఎగ‌రేశారు.

ఇదిలావుంటే.. ఇప్పుడు టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ టికెట్‌ను అధికారికంగా ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌పోయినా.. నెహ్రూకే మ‌రోసారి చాన్స్ ఇస్తార‌ని తెలు స్తోంది. ఇదే జ‌రిగితే.. ఆయ‌న గెలుపు త‌ధ్య‌మ‌నే ప్ర‌చారం ఉంది. ఒక వేళ నెహ్రూ క‌నుక గెలిస్తే.. 1999 త‌ర్వాత టీడీపీ ఇక్క‌డ రికార్డు సృష్టించిన‌ట్టు అవుతుంది. ఎందుకంటే.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది.

1999లో జ్యోతుల నెహ్రూనే టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. 2004, 2009లో కాంగ్రెస్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని.. తోట న‌ర‌సింహం గెలిచారు. ఇక‌, 2014లో వైసీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ(వాస్త‌వానికి టీడీపీ నుంచి ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. అటు నుంచి వైసీపీలోకి వ‌చ్చారు) ఆ ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే, 2017-18 మ‌ధ్య ఆయ‌న మ‌ళ్లీ టీడీపీ చెంత‌కు చేరుకున్నారు.

2019లో వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న సోద‌రుడి కుమారుడు జ్యోతుల చంటిబాబు వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకుని పోటీ చేయ‌గా.. అదే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున నెహ్రూ పోటీ చేశారు. కానీ నెహ్రూ మాత్రం ఓటిపోయారు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌కే టికెట్ ఇస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఒక‌వేళ నెహ్రూ గెలిస్తే.. 1999 త‌ర్వాత అంటే సుమారు నాలుగు ఎన్నిక‌ల త‌ర్వాత‌(20 ఏళ్లకు) టీడీపీ గెలిచే స్థానం ఇదేన‌ని అంటున్నారు.

This post was last modified on July 9, 2023 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago