పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందిన బ్రో ఫస్ట్ ఆడియో సింగల్ అభిమానులను సంతృప్తిపరచలేదని సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను చూస్తే అర్థమైపోతోంది. ఓ రేంజ్ లో వైరల్ కావాల్సిన సాంగ్ ఏదో మాములు స్థాయిలో మెల్లగా మిలియన్ల వ్యూస్ దాటడం పట్ల ఫ్యాన్స్ తమ అసహనాన్ని ఓపెన్ గానే బయట పెడుతున్నారు. మై డియర్ మార్కండేయ ట్యూన్ ప్లస్ సాహిత్యం రెండింటి పరంగా పెద్దగా మార్కులు దక్కించుకోలేకపోయింది. కేవలం పవన్ స్టైల్ అండ్ స్వాగ్ మాత్రమే వీడియోని చివరిదాకా చూసేలా చేస్తున్నాయి.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తమన్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అత్తారింటిది దారేది, గబ్బర్ సింగ్ రేంజ్ లో పేలాల్సిన స్పెషల్ సాంగ్ ఇలా చప్పగా సాగిపోవడం పట్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంలో ఆశ్చర్యం లేదు. దీని దెబ్బకు మహేష్ అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. అసలే గుంటూరు కారం మీద రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తమన్ మీదే ఎక్కువ గాసిప్స్ వచ్చాయి. ఒకదశలో తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ త్రివిక్రమ్ కున్న నమ్మకం అలా జరగనివ్వకుండా అడ్డుపడింది. అసలు ఆల్బం కంపోజింగ్ మొదలయ్యిందో లేదో తెలియదు
ఇదంతా తమన్ సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు ప్రతి ట్యూన్ బెస్ట్ ఉండాలని మ్యూజిక్ లవర్స్ డిమాండ్ చేస్తారు. వాటిని అందుకోవాల్సిందే. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు ఎలాంటి స్కోర్ ఇచ్చాడోననే ఆందోళన అటు మెగా పవర్ స్టార్ టీమ్ లోనూ ఉంది. అల వైకుంఠపురములో నాటి తమన్ కావాలని అందరి కోరిక. ఒకపక్క అనిరుద్ రవిచందర్ తమిళంలో ఎంత బిజీగా ఉన్నా సరే తెలుగు ప్రాజెక్టులు పడుతున్నాడు. అలాంటప్పుడు కాంపిటీటివ్ స్పిరిట్ తో బెస్ట్ ఇవ్వాలి. బ్రో బ్యాలన్స్ పాటలు విన్నాక ఒక ఫైనల్ కంక్లూజన్ కి రావొచ్చు
This post was last modified on July 10, 2023 9:21 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…