Bandi Sanjay
తెలంగాణలో మార్పుల విషయం ఏమోగానీ బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించే విషయంలో అగ్రనేతల ఆలోచనలు మారిపోయాయా ? బండిని అధ్యక్షుడిగానే కంటిన్యు చేయాలని అనుకుంటున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి నిముషంలో మారిన అగ్రనేతల ఆలోచనలకు కారణం ఏమిటి ? ఏమిటంటే బండికి మద్దతుగా ఆరెస్సెస్ చక్రం అడ్డేసిందట. బీజేపీకి మూలమే ఆరెస్సెస్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
చాలా విషయాల్లో బీజేపీని వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సెస్సే అన్న విషయం చాలామందికి తెలుసు. పైకి ఎక్కడా ఆరెస్సెస్ ప్రమేయం కనబడదు కానీ తెరవెనుక మాత్రం బలమైన పాత్రే ఉంటుంది. నరేంద్రమోడీ నియామకం కూడా స్వయంగా ఆరెస్సెస్ కారణంగానే జరిగిందనే విషయమై ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకదశలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ను తప్పిస్తారనే ప్రచారం జరిగినా చివరకు ఏమీకాలేదు.
ఇపుడు తెలంగాణా విషయంలో కూడా అలాగే జరుగుతోందని సమాచారం. బండి బ్యాగ్రౌండ్ కూడా ఆరెస్సెస్సే అని అందరికీ తెలుసు. ఒక్క బండనే కాదు మొదటి నుంచి బీజేపీలోనే ఎదిగిన చాలామంది సీనియర్ నేతల బ్యాగ్రౌండ్ ఆరెస్సెస్సే. కాబట్టి మాతృసంస్థ చెబితే కాదనేవాళ్ళుంటారు. అందుకనే బండిని తప్పించకుండా కంటిన్యు అవ్వాలని అగ్రనేతలు అనుకున్నారట. బండి మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరెస్సెస్ ముఖ్యనేతలు ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలకు బ్రీఫింగ్ ఇచ్చారట. అదికూడా బీజేపీలో ఈమధ్యనే చేరిన నేతలతోనే బండికి సమస్యలు మొదలైనట్లు గట్టిగా చెప్పారట.
నిజానికి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళని బీజేపీలో చేర్చుకోరు. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీ విధానాలన్నీ మారిపోతున్నాయి. బలమైన నేతలుగా అనుకున్న వాళ్ళని ఇతర పార్టీల్లో నుండి లాగేసుకుంటున్నారు. అవసరం కారణంగా లాక్కుంటున్నారు కాబట్టి కీలకపదవులిచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. దాంతో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య గొడవ లై పోతున్నాయి. ఇది కాస్త ఆధిపత్యానికి దారితీసి పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇపుడు బండికి మద్దతుగా ఆరెస్సస్ గట్టిగా నిలబడటానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 4, 2023 1:15 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…