Bandi Sanjay
తెలంగాణలో మార్పుల విషయం ఏమోగానీ బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించే విషయంలో అగ్రనేతల ఆలోచనలు మారిపోయాయా ? బండిని అధ్యక్షుడిగానే కంటిన్యు చేయాలని అనుకుంటున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి నిముషంలో మారిన అగ్రనేతల ఆలోచనలకు కారణం ఏమిటి ? ఏమిటంటే బండికి మద్దతుగా ఆరెస్సెస్ చక్రం అడ్డేసిందట. బీజేపీకి మూలమే ఆరెస్సెస్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
చాలా విషయాల్లో బీజేపీని వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సెస్సే అన్న విషయం చాలామందికి తెలుసు. పైకి ఎక్కడా ఆరెస్సెస్ ప్రమేయం కనబడదు కానీ తెరవెనుక మాత్రం బలమైన పాత్రే ఉంటుంది. నరేంద్రమోడీ నియామకం కూడా స్వయంగా ఆరెస్సెస్ కారణంగానే జరిగిందనే విషయమై ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకదశలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ను తప్పిస్తారనే ప్రచారం జరిగినా చివరకు ఏమీకాలేదు.
ఇపుడు తెలంగాణా విషయంలో కూడా అలాగే జరుగుతోందని సమాచారం. బండి బ్యాగ్రౌండ్ కూడా ఆరెస్సెస్సే అని అందరికీ తెలుసు. ఒక్క బండనే కాదు మొదటి నుంచి బీజేపీలోనే ఎదిగిన చాలామంది సీనియర్ నేతల బ్యాగ్రౌండ్ ఆరెస్సెస్సే. కాబట్టి మాతృసంస్థ చెబితే కాదనేవాళ్ళుంటారు. అందుకనే బండిని తప్పించకుండా కంటిన్యు అవ్వాలని అగ్రనేతలు అనుకున్నారట. బండి మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరెస్సెస్ ముఖ్యనేతలు ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలకు బ్రీఫింగ్ ఇచ్చారట. అదికూడా బీజేపీలో ఈమధ్యనే చేరిన నేతలతోనే బండికి సమస్యలు మొదలైనట్లు గట్టిగా చెప్పారట.
నిజానికి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళని బీజేపీలో చేర్చుకోరు. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీ విధానాలన్నీ మారిపోతున్నాయి. బలమైన నేతలుగా అనుకున్న వాళ్ళని ఇతర పార్టీల్లో నుండి లాగేసుకుంటున్నారు. అవసరం కారణంగా లాక్కుంటున్నారు కాబట్టి కీలకపదవులిచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. దాంతో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య గొడవ లై పోతున్నాయి. ఇది కాస్త ఆధిపత్యానికి దారితీసి పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇపుడు బండికి మద్దతుగా ఆరెస్సస్ గట్టిగా నిలబడటానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 4, 2023 1:15 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…