Bandi Sanjay
తెలంగాణలో మార్పుల విషయం ఏమోగానీ బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించే విషయంలో అగ్రనేతల ఆలోచనలు మారిపోయాయా ? బండిని అధ్యక్షుడిగానే కంటిన్యు చేయాలని అనుకుంటున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి నిముషంలో మారిన అగ్రనేతల ఆలోచనలకు కారణం ఏమిటి ? ఏమిటంటే బండికి మద్దతుగా ఆరెస్సెస్ చక్రం అడ్డేసిందట. బీజేపీకి మూలమే ఆరెస్సెస్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
చాలా విషయాల్లో బీజేపీని వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సెస్సే అన్న విషయం చాలామందికి తెలుసు. పైకి ఎక్కడా ఆరెస్సెస్ ప్రమేయం కనబడదు కానీ తెరవెనుక మాత్రం బలమైన పాత్రే ఉంటుంది. నరేంద్రమోడీ నియామకం కూడా స్వయంగా ఆరెస్సెస్ కారణంగానే జరిగిందనే విషయమై ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకదశలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ను తప్పిస్తారనే ప్రచారం జరిగినా చివరకు ఏమీకాలేదు.
ఇపుడు తెలంగాణా విషయంలో కూడా అలాగే జరుగుతోందని సమాచారం. బండి బ్యాగ్రౌండ్ కూడా ఆరెస్సెస్సే అని అందరికీ తెలుసు. ఒక్క బండనే కాదు మొదటి నుంచి బీజేపీలోనే ఎదిగిన చాలామంది సీనియర్ నేతల బ్యాగ్రౌండ్ ఆరెస్సెస్సే. కాబట్టి మాతృసంస్థ చెబితే కాదనేవాళ్ళుంటారు. అందుకనే బండిని తప్పించకుండా కంటిన్యు అవ్వాలని అగ్రనేతలు అనుకున్నారట. బండి మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరెస్సెస్ ముఖ్యనేతలు ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలకు బ్రీఫింగ్ ఇచ్చారట. అదికూడా బీజేపీలో ఈమధ్యనే చేరిన నేతలతోనే బండికి సమస్యలు మొదలైనట్లు గట్టిగా చెప్పారట.
నిజానికి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళని బీజేపీలో చేర్చుకోరు. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీ విధానాలన్నీ మారిపోతున్నాయి. బలమైన నేతలుగా అనుకున్న వాళ్ళని ఇతర పార్టీల్లో నుండి లాగేసుకుంటున్నారు. అవసరం కారణంగా లాక్కుంటున్నారు కాబట్టి కీలకపదవులిచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. దాంతో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య గొడవ లై పోతున్నాయి. ఇది కాస్త ఆధిపత్యానికి దారితీసి పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇపుడు బండికి మద్దతుగా ఆరెస్సస్ గట్టిగా నిలబడటానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 4, 2023 1:15 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…