టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా లోకేష్….స్థానిక మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ‘మహాశక్తితో లోకేష్’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువతులు, మహిళలు, గృహిణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లోకేష్ కు వారు మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ కు లోకేష్ ముద్దు పేరు పెట్టారు. ఇకపై బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని పిలుద్దాం అంటూ సెటైర్లు వేశారు. అరకు, పాడేరు ప్రాంతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు ఆధ్వర్యంలో గంజాయి పండిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మన్యం, అరకు ప్రాంతాలలో పండించిన గంజాయిని రాష్ట్రంలోని గ్రామగ్రామాలకు పంపిణీ చేస్తున్నారని, డీలర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోందని లోకేష్ ఆరోపించారు. అధికారంలో ఉన్నవాళ్లే గంజాయిని సాగు చేసి సరఫరా చేస్తుంటే యువతీయువకులు గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారని లోకేష్ ఆరోపించారు.
తాడేపల్లిలో రోజుకో గంజాయి ఘటన జరుగుతోందని, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి మత్తులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటివరకు ఈ సీఎం జగన్ స్పందించలేకపోయాడని దుయ్యబట్టారు. నాయకుడు కఠినంగా లేడని, అందుకే వైసీపీ నేతలకు భయం, భక్తి లేక ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారని ఆరోపించారు. 2024 మే నెలలో న్యూస్ ఛానల్స్ లో టీడీపీ మెజారిటీ నియోజకవర్గాలలో లీడింగ్ లో ఉంది అన్న వార్త వచ్చిన వెంటనే ఏపీలో లా అండ్ ఆర్డర్ సెట్ అవుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి చంద్రబాబు అంటే హడల్ అని, లోకేష్ తప్పు చేసినా చంద్రబాబు ఊరుకోరని అన్నారు.
This post was last modified on July 4, 2023 8:47 am
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…