Political News

ఎవడ్రా ఆపేది… చౌదరి ఫైర్

ఈ రోజు ఖమ్మం జిల్లాలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతలు ఈ సభకు హాజరు కాబోతున్నారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కూడా ఈ సభ సందర్భంగా జరగనుంది. అయితే, ఈ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా ప్రజలు మేము వెళ్తున్నాం. నువ్వు ఎవడ్రా ఆపడానికి అంటూ పోలీసులపై మండిపడ్డారు. బారికేడ్లు పెడితే భయపడి ఆగిపోతామా? అది పిచ్చి భ్రమ…ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ ఆమె శివమెత్తారు.

తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, బస్సులు ఇవ్వకుంటే సభకు వెళ్లలేమా అని నిప్పులు చెరిగారు. నడిచైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సభాస్థలికి చేరుకుంటారని సవాల్ చేశారు. సభకు అనుమతి అడిగినప్పుడు ఇచ్చారని, ఆ తర్వాత మనసు మార్చుకున్నారని రేణుకా చౌదరి అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్ కు వెళ్లొద్దని చెబుతున్నారని, అడుక్కుతినే వెధవలు అంటూ బీఆర్ఎస్ నేతలపై రేణుకా చౌదరి మండిపడ్డారు.

ఇక, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మండిపడ్డారు. జన గర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు పలికారు. రాహుల్ గాంధీ సభను అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని కేసీఆర్ కు హితవు పలికారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు చూడలేదని అన్నారు. పోలీసులకు కేసీఆర్ సూచనలు ఇవ్వకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని ఆరోపించారు.

This post was last modified on July 2, 2023 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

22 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

1 hour ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

3 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

4 hours ago