Political News

ఎవడ్రా ఆపేది… చౌదరి ఫైర్

ఈ రోజు ఖమ్మం జిల్లాలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతలు ఈ సభకు హాజరు కాబోతున్నారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కూడా ఈ సభ సందర్భంగా జరగనుంది. అయితే, ఈ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా ప్రజలు మేము వెళ్తున్నాం. నువ్వు ఎవడ్రా ఆపడానికి అంటూ పోలీసులపై మండిపడ్డారు. బారికేడ్లు పెడితే భయపడి ఆగిపోతామా? అది పిచ్చి భ్రమ…ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ ఆమె శివమెత్తారు.

తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, బస్సులు ఇవ్వకుంటే సభకు వెళ్లలేమా అని నిప్పులు చెరిగారు. నడిచైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సభాస్థలికి చేరుకుంటారని సవాల్ చేశారు. సభకు అనుమతి అడిగినప్పుడు ఇచ్చారని, ఆ తర్వాత మనసు మార్చుకున్నారని రేణుకా చౌదరి అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్ కు వెళ్లొద్దని చెబుతున్నారని, అడుక్కుతినే వెధవలు అంటూ బీఆర్ఎస్ నేతలపై రేణుకా చౌదరి మండిపడ్డారు.

ఇక, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మండిపడ్డారు. జన గర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు పలికారు. రాహుల్ గాంధీ సభను అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని కేసీఆర్ కు హితవు పలికారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు చూడలేదని అన్నారు. పోలీసులకు కేసీఆర్ సూచనలు ఇవ్వకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని ఆరోపించారు.

This post was last modified on July 2, 2023 6:30 pm

Share

Recent Posts

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

15 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

2 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

9 hours ago