ఈ రోజు ఖమ్మం జిల్లాలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతలు ఈ సభకు హాజరు కాబోతున్నారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కూడా ఈ సభ సందర్భంగా జరగనుంది. అయితే, ఈ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా ప్రజలు మేము వెళ్తున్నాం. నువ్వు ఎవడ్రా ఆపడానికి అంటూ పోలీసులపై మండిపడ్డారు. బారికేడ్లు పెడితే భయపడి ఆగిపోతామా? అది పిచ్చి భ్రమ…ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ ఆమె శివమెత్తారు.
తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, బస్సులు ఇవ్వకుంటే సభకు వెళ్లలేమా అని నిప్పులు చెరిగారు. నడిచైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సభాస్థలికి చేరుకుంటారని సవాల్ చేశారు. సభకు అనుమతి అడిగినప్పుడు ఇచ్చారని, ఆ తర్వాత మనసు మార్చుకున్నారని రేణుకా చౌదరి అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్ కు వెళ్లొద్దని చెబుతున్నారని, అడుక్కుతినే వెధవలు అంటూ బీఆర్ఎస్ నేతలపై రేణుకా చౌదరి మండిపడ్డారు.
ఇక, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మండిపడ్డారు. జన గర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు పలికారు. రాహుల్ గాంధీ సభను అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని కేసీఆర్ కు హితవు పలికారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు చూడలేదని అన్నారు. పోలీసులకు కేసీఆర్ సూచనలు ఇవ్వకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని ఆరోపించారు.
This post was last modified on July 2, 2023 6:30 pm
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…