ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలల గడువు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు పట్టుమని 10 నెలలు కూడా లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో తమదే విజయం అని అన్ని పార్టీలు ధీమాతో ముందుకు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అన్న విషయంపై సర్వే చేపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మీడియా టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వైసీపీకి 24 ఎంపీ స్థానాలు వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఉన్నపళంగా ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తన నివేదికలో వెల్లడించింది.
ఇక, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఒక ఎంపీ స్థానం వస్తుందని, జనసేన, బీజేపీలకు ఒక సీటు కూడా రాదని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ సర్వే చెప్పింది. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు…కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఇక, కేంద్రంలో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే తెలిపింది. కేంద్రంలో కాంగ్రెస్ 111 నుంచి 149 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 255 నుంచి 325 స్థానాలు వస్తాయని, ప్రధాని మోడీ మరోసారి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారని అంచనా వేసింది. జన్ గన్ కామన్ అనే పేరుతో టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన ఈ సర్వే వైసీపీ, బీజేపీ నేతలకు కొత్త జోష్ ఇచ్చింది.
This post was last modified on July 1, 2023 10:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…
తమిళ సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడి నుంచి వచ్చే అనువాద…
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…