Political News

ఆ సర్వేలో టీడీపీకి షాకింగ్ రిజల్ట్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలల గడువు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు పట్టుమని 10 నెలలు కూడా లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో తమదే విజయం అని అన్ని పార్టీలు ధీమాతో ముందుకు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అన్న విషయంపై సర్వే చేపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మీడియా టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వైసీపీకి 24 ఎంపీ స్థానాలు వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఉన్నపళంగా ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తన నివేదికలో వెల్లడించింది.

ఇక, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఒక ఎంపీ స్థానం వస్తుందని, జనసేన, బీజేపీలకు ఒక సీటు కూడా రాదని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ సర్వే చెప్పింది. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు…కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఇక, కేంద్రంలో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే తెలిపింది. కేంద్రంలో కాంగ్రెస్ 111 నుంచి 149 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 255 నుంచి 325 స్థానాలు వస్తాయని, ప్రధాని మోడీ మరోసారి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారని అంచనా వేసింది. జన్ గన్ కామన్ అనే పేరుతో టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన ఈ సర్వే వైసీపీ, బీజేపీ నేతలకు కొత్త జోష్ ఇచ్చింది.

This post was last modified on July 1, 2023 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago