Political News

ఆ సర్వేలో టీడీపీకి షాకింగ్ రిజల్ట్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలల గడువు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు పట్టుమని 10 నెలలు కూడా లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో తమదే విజయం అని అన్ని పార్టీలు ధీమాతో ముందుకు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అన్న విషయంపై సర్వే చేపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మీడియా టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వైసీపీకి 24 ఎంపీ స్థానాలు వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఉన్నపళంగా ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తన నివేదికలో వెల్లడించింది.

ఇక, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఒక ఎంపీ స్థానం వస్తుందని, జనసేన, బీజేపీలకు ఒక సీటు కూడా రాదని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ సర్వే చెప్పింది. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు…కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఇక, కేంద్రంలో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే తెలిపింది. కేంద్రంలో కాంగ్రెస్ 111 నుంచి 149 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 255 నుంచి 325 స్థానాలు వస్తాయని, ప్రధాని మోడీ మరోసారి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారని అంచనా వేసింది. జన్ గన్ కామన్ అనే పేరుతో టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన ఈ సర్వే వైసీపీ, బీజేపీ నేతలకు కొత్త జోష్ ఇచ్చింది.

This post was last modified on July 1, 2023 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

4 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

4 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

4 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

5 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

7 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

8 hours ago