గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని భుజాలపైకి ఎత్తుకున్న కీలక నాయకుడు.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతోపాటు.. ఆయన విజయానికి కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు.. తాజాగా టీడీపీకి జైకొట్టారు. ఆయనే ఉమ్మడి కృష్నాజిల్లాలోని అవనిగడ్డకు చెందిన పరుచూరి సుభాష్ చంద్రబోస్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోస్.. 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్నీ తానై వ్యవహరించారు.
ఫలితంగా కమ్మ ఓటు బ్యాంకు.. వైసీపీకి అనుకూలంగా పడేలా చేశారనే వాదన ఉంది. ప్రజల్లోనూ బలమైన గుర్తింపు ఉన్న సుభాష్కు ఇటీవల కాలంలో వైసీపీలో అవమానాలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ టికెట్ను ఆయన ఆశించారు. అయితే.. దీనిని ఇస్తామని చెప్పిన వైసీపీ అధిష్టానం .. ఇటీవల కాలంలో కనీసం ఆయనను పట్టించుకోలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో పనిచేసేందుకు అంగీకరించారు.
ఈ క్రమంలో పరుచూరి సుభాష్ చంద్రబోస్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 100 కార్లలో అవనిగడ్డ నుంచి ఉండవల్లికి వచ్చిన ఆయన.. మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించి తెలుగుదేశంలో చేరినట్టు తెలిపారు.
This post was last modified on July 1, 2023 8:21 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…