Political News

క‌మ్మ బోస్‌ వైసీపీ నుంచి టీడీపీలోకి ఎక్క‌డంటే!

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యాన్ని భుజాల‌పైకి ఎత్తుకున్న కీల‌క నాయ‌కుడు.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డంతోపాటు.. ఆయ‌న విజ‌యానికి కీల‌క పాత్ర పోషించిన యువ నాయ‌కుడు.. తాజాగా టీడీపీకి జైకొట్టారు. ఆయ‌నే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని అవ‌నిగ‌డ్డకు చెందిన ప‌రుచూరి సుభాష్ చంద్ర‌బోస్‌. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన బోస్‌.. 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.

ఫ‌లితంగా క‌మ్మ ఓటు బ్యాంకు.. వైసీపీకి అనుకూలంగా ప‌డేలా చేశార‌నే వాద‌న ఉంది. ప్ర‌జ‌ల్లోనూ బ‌ల‌మైన గుర్తింపు ఉన్న సుభాష్‌కు ఇటీవ‌ల కాలంలో వైసీపీలో అవ‌మానాలు ఎక్కువ‌య్యాయి. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌నిగ‌డ్డ టికెట్‌ను ఆయ‌న ఆశించారు. అయితే.. దీనిని ఇస్తామ‌ని చెప్పిన వైసీపీ అధిష్టానం .. ఇటీవ‌ల కాలంలో క‌నీసం ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ నేతృత్వంలో ప‌నిచేసేందుకు అంగీక‌రించారు.

ఈ క్ర‌మంలో ప‌రుచూరి సుభాష్ చంద్ర‌బోస్‌.. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 100 కార్ల‌లో అవ‌నిగ‌డ్డ నుంచి ఉండ‌వ‌ల్లికి వ‌చ్చిన ఆయ‌న‌.. మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ నేతృత్వంలో పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌రుచూరి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించి తెలుగుదేశంలో చేరిన‌ట్టు తెలిపారు.

This post was last modified on July 1, 2023 8:21 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

11 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

54 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago