Political News

టీడీపీ దెబ్బ‌కు జ‌గ‌న్ యూట‌ర్న్… వైసీపీలో గుస‌గుస‌!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు.. ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల దెబ్బ‌తో రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. కేంద్రం వ‌ద్దకు ముఖ్య‌మం త్రి, ఇత‌ర మంత్రులు వెళ్లిన ప్ర‌తిసారీ.. మేనిఫెస్టోపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. త‌ర‌చుగా ఈ ఉచితాలేంటి?  మీ ప్ర‌భుత్వం ఏంటి? అని పెద‌వి విరుస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ, అప్ప‌టి ఎన్నిక‌ల్లో అలా జ‌రిగిపోయింద‌ని.. ఈ ఒక్క‌సారి ఆదుకోండ‌ని.. ఇక‌పై జ‌ర‌గ‌కుండా చూస్తామ ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌చుగా కేంద్రం వ‌ద్ద వాపోతోంది. అలా చేసుకుని అప్పులు తెచ్చుకుంటోంది. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. వైసీపీ ప్ర‌భుత్వం ఉచితాల్లో స‌గానికి స‌గం కోత‌వేయాల‌ని నిర్ణ‌యించు కుంద‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో ఒక టాక్ వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఇస్తున్న‌వి చాలు అనే ధోర‌ణిని వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా చెబుతున్నార‌ని చ‌ర్చ సాగుతోంది.

అంటే.. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ కొత్త‌గా ప్ర‌క‌టించే ప‌థ‌కాలు ఏమీ ఉండ‌బోవ‌ని.. ప్ర‌స్తుతం ఇస్తున్న వాటిలో నూ కొన్నింటిని నిలిపివేసి.. ఆర్థిక ప‌రిస్థితిని గాడిలో పెట్టే చ‌ర్య‌లు తీసుకుంటార‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. అయితే.. ఇటీవ‌ల టీడీపీ ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టో.. ఆ పార్టీలో కంటే కూడా వైసీపీలో జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌మ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టార‌ని అంటున్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం అంత‌ర్మ‌థ‌నం పెరిగిపోయింది.

టీడీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టో ప్ర‌కారం  ఇంట్లో ఎంతమంది పిల్ల‌లు ఉన్నా మాతృవంద‌నం కింద రూ. 15000 చొప్పున అంద‌నుంది. అదేవిధంగా రైతుల‌కు రూ.20 వేలు ఇవ్వ‌నున్నారు. ఉద్యోగం రాని వారికి రూ.3000 చొప్పున భృతి ఇవ్వ‌నున్నారు. ఇంకా ఇత‌ర‌త్రా ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఇవ‌న్నీ చూశాక‌.. జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డార‌ని.. టీడీపీ క‌న్నా.. ఒక్క‌టైనా ఎక్కువ ఇవ్వ‌క‌పోతే.. త‌మ‌కు ఇబ్బందేన‌ని గ్ర‌హించి.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోబోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on June 28, 2023 11:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

4 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

4 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

4 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

5 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

7 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

8 hours ago