Political News

టీడీపీ దెబ్బ‌కు జ‌గ‌న్ యూట‌ర్న్… వైసీపీలో గుస‌గుస‌!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు.. ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల దెబ్బ‌తో రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. కేంద్రం వ‌ద్దకు ముఖ్య‌మం త్రి, ఇత‌ర మంత్రులు వెళ్లిన ప్ర‌తిసారీ.. మేనిఫెస్టోపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. త‌ర‌చుగా ఈ ఉచితాలేంటి?  మీ ప్ర‌భుత్వం ఏంటి? అని పెద‌వి విరుస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ, అప్ప‌టి ఎన్నిక‌ల్లో అలా జ‌రిగిపోయింద‌ని.. ఈ ఒక్క‌సారి ఆదుకోండ‌ని.. ఇక‌పై జ‌ర‌గ‌కుండా చూస్తామ ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌చుగా కేంద్రం వ‌ద్ద వాపోతోంది. అలా చేసుకుని అప్పులు తెచ్చుకుంటోంది. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. వైసీపీ ప్ర‌భుత్వం ఉచితాల్లో స‌గానికి స‌గం కోత‌వేయాల‌ని నిర్ణ‌యించు కుంద‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో ఒక టాక్ వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఇస్తున్న‌వి చాలు అనే ధోర‌ణిని వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా చెబుతున్నార‌ని చ‌ర్చ సాగుతోంది.

అంటే.. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ కొత్త‌గా ప్ర‌క‌టించే ప‌థ‌కాలు ఏమీ ఉండ‌బోవ‌ని.. ప్ర‌స్తుతం ఇస్తున్న వాటిలో నూ కొన్నింటిని నిలిపివేసి.. ఆర్థిక ప‌రిస్థితిని గాడిలో పెట్టే చ‌ర్య‌లు తీసుకుంటార‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. అయితే.. ఇటీవ‌ల టీడీపీ ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టో.. ఆ పార్టీలో కంటే కూడా వైసీపీలో జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌మ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టార‌ని అంటున్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం అంత‌ర్మ‌థ‌నం పెరిగిపోయింది.

టీడీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టో ప్ర‌కారం  ఇంట్లో ఎంతమంది పిల్ల‌లు ఉన్నా మాతృవంద‌నం కింద రూ. 15000 చొప్పున అంద‌నుంది. అదేవిధంగా రైతుల‌కు రూ.20 వేలు ఇవ్వ‌నున్నారు. ఉద్యోగం రాని వారికి రూ.3000 చొప్పున భృతి ఇవ్వ‌నున్నారు. ఇంకా ఇత‌ర‌త్రా ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఇవ‌న్నీ చూశాక‌.. జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డార‌ని.. టీడీపీ క‌న్నా.. ఒక్క‌టైనా ఎక్కువ ఇవ్వ‌క‌పోతే.. త‌మ‌కు ఇబ్బందేన‌ని గ్ర‌హించి.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోబోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

6 minutes ago

“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…

1 hour ago

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

1 hour ago

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

2 hours ago

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

5 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

6 hours ago