2024 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని గట్టి సంకల్పం చెప్పుకొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఇంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఉన్న.. కొన్నిచోట్ల అసలు లేని ఇంచార్జుల విషయాన్ని చంద్రబాబు సీరియస్గానే తీసుకున్నారు. ఎన్నికలకు మరో 8 మాసాలే గడువు ఉండడంతో చంద్రబాబు ఆదిశగా ఇప్పుడు చర్యలు తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేవారు ఎవరు? ఓడే వారెవరు అని తేల్చే నేతల గ్రాఫ్ పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇంటిని చక్కదిద్దే పనిని చాలా వేగంగా చేపట్టారని సీనియర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం 60కి పైగా నియోజకవర్గాలు.. టీడీపీ కళ్లు మూసుకున్నా గెలిచే పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబు పదే పదే పర్యటించారు. అయితే.. నేతల మధ్య సమన్వయం లేని కారణంగా.. ఆ నియోజకవర్గాల్లో ఒకింత ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఇంచార్జులతో రివ్యూ మీటింగులు చేపట్టారు. మరికొన్ని స్థానాల్లో ఇంచార్జుల నియామకాన్ని టీడీపీ అదినేత వేగవంతం చేశారు. ఇప్పటికే 43 అసెంబ్లీ ఇంచార్జులతో రెండో దఫా సమీక్షలు ముగిసాయి.
ఇంచార్జుల నియామకంపై కొన్ని స్ధానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకాలని నిర్ణయించారు. ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గానికి కన్నా లక్ష్మీ నారాయణను ఇంచార్జిగా నియమించారు. అయితే.. ఇక్కడ కోడెల శివరామకృష్ణ వివాదానికి దారి తీశారు. దీనిని సరిదిద్దారు. ఇలానే.. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని ఇప్పుడు సరిదిద్దుతున్న సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా వీఎం థామస్, పూతలపట్టుకు కలికిరి మురళీ మోహన్ను నియమించారు. ఇలానే.. చిత్తూరులోని కీలక నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నియమించాలని నిర్ణయించారు.
వర్గ పోరు లేకుండా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమలోని గోపాలపురం నియోజవకర్గంలో ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు, పార్టీ నేత బాపిరాజుల మధ్య నెలకొన్న వివాదాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మద్దిపాటికే టికెట్ అని ఇప్పటికే చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇదిలావుంటే.. పార్టీలో చేరేవారిని మరింత మందిని ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి భవిష్యత్కు గ్యారెంటీపై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ముందే.. ఇంటి సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on June 28, 2023 11:26 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…