Political News

గులాబీలో గుబులు మొదలైందా?

కాంగ్రెస్ పార్టీ జోరు చూసిన తర్వాత గులాబీపార్టీ నేతల్లో గుబులు మొదలైనట్లుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ గట్టినేతలే. ఈ నేతలను కేసీయార్ పార్టీనుండి బహిష్కరించిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఖమ్మం, మహబూబ్ నగర్లో బహిరంగసభలు నిర్వహించి కాంగ్రెస్ కండువాలను కప్పుకోబోతున్నారు. ఇక్కడే కారుపార్టీ నేతల్లో భయం పెరిగిపోతోందట. పొంగులేటి ఖమ్మంకు ఎంపీగా చేశారు. అలాగే జూపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టి నేతే.

వీళ్ళిద్దరి కారణంగా ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే వీళ్ళ చేరిక తర్వాత మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాట్లు ప్రచారం జరుగుతోంది. కారుపార్టీ నేతల టాక్ ప్రకారమైతే ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, కరీనంగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలం పెరగటం ఖాయమట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బాగా బలం పుంజుకునే అవకాశముందని కారుపార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

వలసలు, ఘర్ వాపసీ కార్యక్రమాలతో ఇతర పార్టీల నేతలు మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అలాగే మరికొందరు నేతలు కూడా తొందరలోనే చేరబోతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదంతా చూస్తుంటే ముందు బీజేపీకి తర్వాత బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దెబ్బ ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ప్రత్యర్ధిపార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోవటానికి కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందని, అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే మౌత్ పబ్లిసిటీయే ప్రధాన కారణం.

ఇదే సమయంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. అలాగే బీజేపీ నేతలు కూడా బాగా డల్ అయిపోయారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. విభేదాలను పక్కనపెట్టేసి సీనియర్ నేతలంతా ఏకతాటిపైన నిలబడితే తెలంగాణాలో కూడా గెలుపు ఖాయమనే మాట బాగా పనిచేస్తున్నట్లుంది. ఎందుకంటే ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడూ గెలిచే అవకాశం రాదనే టాక్ కూడా ప్రభావం చూపుతోంది. మొత్తానికి గులాబీపార్టీలో గుబులు పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం. 

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

11 minutes ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

43 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

48 minutes ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

59 minutes ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

2 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago