Political News

జగన్ కీలక నిర్ణయం.. మోపిదేవి సీటు పెన్మత్సకు

ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ బరికి వైసీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ నెల 24న జరగనున్న ఈ ఎన్నికలో వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, సోమవారం కన్నుమూసిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు పెన్మత్స సురేశ్ బాబు బరిలోకి దిగనున్నారు.

ఈ మేరకు మంగళవారం జగన్.. పెన్మత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పెన్మత్స… జగన్ వైసీపీని ప్రారంభించాక జగన్ తోనే కలిసి సాగారు.

అయితే వివిధ సమీకరణాల రిత్యా మొన్నటి ఎన్నికల్లో పెన్మత్సకు జగన్ టికెట్ కేటాయించలేకపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కీలక పదవిలో పెన్మత్సను జగన్ నియమిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునేలోగానే పెన్మత్స సోమవారం కన్నుమూశారు.

ఈ క్రమంలో పెన్మత్స మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్… తన వెంట నడిచిన సీనియర్ పొలిటీషియన్ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతోనే పెన్మత్స తనయుడు సురేశ్ బాబును తాజాగా పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే మండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేసిన జగన్… మోపిదేవితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోపిదేవి ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును పెన్మత్స కుమారుడు సురేశ్ బాబుకు జగన్ ఖారారు చేశారు.

This post was last modified on August 12, 2020 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

1 hour ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

2 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

3 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

4 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

4 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

4 hours ago