జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడపై జనసేన, కాపు నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ పొలిటిషియన్ చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజులు ముద్రగడపై తనకు సదభిప్రాయం ఉండేదని, ఈ రోజు పవన్ పై ఆయన రాసిన లేఖతో అది పోయిందని హరిరామజోగయ్య దుయ్యబట్టారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు ముద్రగడ సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాపు ఉద్యమాన్ని ముద్రగడ నడిపారని ఈ లేఖతో తేటతెల్లమైందని చెప్పారు.
కాపు ఉద్యమాన్ని నేటితో ముద్రగడ గంగలో కలిపేశారని హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 21, 2023 9:52 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…