జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడపై జనసేన, కాపు నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ పొలిటిషియన్ చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజులు ముద్రగడపై తనకు సదభిప్రాయం ఉండేదని, ఈ రోజు పవన్ పై ఆయన రాసిన లేఖతో అది పోయిందని హరిరామజోగయ్య దుయ్యబట్టారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు ముద్రగడ సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాపు ఉద్యమాన్ని ముద్రగడ నడిపారని ఈ లేఖతో తేటతెల్లమైందని చెప్పారు.
కాపు ఉద్యమాన్ని నేటితో ముద్రగడ గంగలో కలిపేశారని హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 21, 2023 9:52 am
రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే సమయం ఆసన్నమైందా? ఇప్పటికే ఆయన…
ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి…
అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెలబ్రేషన్ కన్నా ఎక్కువ. ఓజి లాగా రికార్డులు బద్దలు కొట్టినా, హరిహర వీరమల్లు…
బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు సినిమాలు ట్రెండింగ్…
అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ…