జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడపై జనసేన, కాపు నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ పొలిటిషియన్ చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజులు ముద్రగడపై తనకు సదభిప్రాయం ఉండేదని, ఈ రోజు పవన్ పై ఆయన రాసిన లేఖతో అది పోయిందని హరిరామజోగయ్య దుయ్యబట్టారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు ముద్రగడ సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాపు ఉద్యమాన్ని ముద్రగడ నడిపారని ఈ లేఖతో తేటతెల్లమైందని చెప్పారు.
కాపు ఉద్యమాన్ని నేటితో ముద్రగడ గంగలో కలిపేశారని హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 21, 2023 9:52 am
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…