Political News

ఏపీ స‌త్యం.. జ‌గ‌న్ మిథ్య‌!!

ఏపీ స‌త్యం.. జ‌గ‌న్ మిథ్య‌! ప్ర‌స్తుతం మేధావులు అంటున్న మాట ఇదే! ఎందుకంటే.. ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న పాల‌న‌కు తానే స‌ర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. త‌న పాల‌న‌లోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంద‌ని చెబుతున్నారు. గ‌త నాలుగేళ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందింద‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. అయితే.. జ‌గ‌న్‌కు ముందు.. కూడా రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్య‌మంత్రులు పాలించారు.

అంతెందుకు.. జ‌గన్ తండ్రి వైఎస్ ఐదున్న‌ర సంవ‌త్స‌రాలు పాలించారు. ఇక‌, జ‌గ‌న్ త‌ర్వాత కూడా.. అనేక మంది ముఖ్య‌మంత్రులు అవుతారు. జ‌గ‌న్‌తోనే ఏదీ ప్రారంభం కాలేదు.. ఆయ‌న‌తోనే ఏదీ అంత‌మూ కాదు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని మేధావులు చెబుతున్నారు. అందుకే.. ఏపీ స‌త్యం అనే మాటను వారు వినిపిస్తున్నారు. తాజాగా గుడివాడ‌లో ప‌ర్య‌టించిన సీఎం జ‌గ‌న్‌.. త‌న వ‌ల్లే అంతా జ‌రుగుతున్న‌ట్టు స‌ర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు.

స్వ‌యం ప్ర‌క‌టిత అద్భుత‌ పాల‌న‌లో టిడ్కో గృహాల‌ను తానే నిర్మించాన‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. వాస్త‌వాన్ని జ‌గ‌న్ గుర్తించక‌పోయినా.. ప్ర‌జ‌లు గుర్తిస్త‌న్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు పెట్టుకుంటే మంచి ద‌ని మేధావులు చెబుతున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు జ‌రిగాయో.. ప్ర‌జ‌లకు, ముఖ్యంగా ల‌బ్ధిదారుల‌కు బాగానే తెలుసు. కానీ, త‌న‌ను తాను పెద్ద‌వాడిగా ఊహించుకుని.. త‌న హ‌యాంలోనే నిర్మాణాలు పూర్త‌య్యాయ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు.

ఏదైనా చెబితే ప్ర‌జ‌లు న‌మ్మేలాగా ఉండాల‌ని.. అలాకాదంటే.. న‌ష్టం ఎవ‌రికో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రెండేళ్ల‌పాటు.. క‌రోనా కార‌ణంగా ప‌నులు నిలిచిపోయాయి. ఉపాధి రంగం, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. మ‌రి ఆ రెండేళ్ల‌ను తీసేస్తే.. కేవ‌లం రెండేళ్ల‌లోనే టిడ్కో గృహాలు నిర్మించారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. చెప్పేవారు.. ఎలా ఉన్నా.. వింటున్న ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని.. మేధావులు అంటున్నారు.

This post was last modified on June 18, 2023 9:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago