Political News

ఏపీ స‌త్యం.. జ‌గ‌న్ మిథ్య‌!!

ఏపీ స‌త్యం.. జ‌గ‌న్ మిథ్య‌! ప్ర‌స్తుతం మేధావులు అంటున్న మాట ఇదే! ఎందుకంటే.. ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న పాల‌న‌కు తానే స‌ర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. త‌న పాల‌న‌లోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంద‌ని చెబుతున్నారు. గ‌త నాలుగేళ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందింద‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. అయితే.. జ‌గ‌న్‌కు ముందు.. కూడా రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్య‌మంత్రులు పాలించారు.

అంతెందుకు.. జ‌గన్ తండ్రి వైఎస్ ఐదున్న‌ర సంవ‌త్స‌రాలు పాలించారు. ఇక‌, జ‌గ‌న్ త‌ర్వాత కూడా.. అనేక మంది ముఖ్య‌మంత్రులు అవుతారు. జ‌గ‌న్‌తోనే ఏదీ ప్రారంభం కాలేదు.. ఆయ‌న‌తోనే ఏదీ అంత‌మూ కాదు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని మేధావులు చెబుతున్నారు. అందుకే.. ఏపీ స‌త్యం అనే మాటను వారు వినిపిస్తున్నారు. తాజాగా గుడివాడ‌లో ప‌ర్య‌టించిన సీఎం జ‌గ‌న్‌.. త‌న వ‌ల్లే అంతా జ‌రుగుతున్న‌ట్టు స‌ర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు.

స్వ‌యం ప్ర‌క‌టిత అద్భుత‌ పాల‌న‌లో టిడ్కో గృహాల‌ను తానే నిర్మించాన‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. వాస్త‌వాన్ని జ‌గ‌న్ గుర్తించక‌పోయినా.. ప్ర‌జ‌లు గుర్తిస్త‌న్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు పెట్టుకుంటే మంచి ద‌ని మేధావులు చెబుతున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు జ‌రిగాయో.. ప్ర‌జ‌లకు, ముఖ్యంగా ల‌బ్ధిదారుల‌కు బాగానే తెలుసు. కానీ, త‌న‌ను తాను పెద్ద‌వాడిగా ఊహించుకుని.. త‌న హ‌యాంలోనే నిర్మాణాలు పూర్త‌య్యాయ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు.

ఏదైనా చెబితే ప్ర‌జ‌లు న‌మ్మేలాగా ఉండాల‌ని.. అలాకాదంటే.. న‌ష్టం ఎవ‌రికో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రెండేళ్ల‌పాటు.. క‌రోనా కార‌ణంగా ప‌నులు నిలిచిపోయాయి. ఉపాధి రంగం, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. మ‌రి ఆ రెండేళ్ల‌ను తీసేస్తే.. కేవ‌లం రెండేళ్ల‌లోనే టిడ్కో గృహాలు నిర్మించారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. చెప్పేవారు.. ఎలా ఉన్నా.. వింటున్న ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని.. మేధావులు అంటున్నారు.

This post was last modified on June 18, 2023 9:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago