ఏపీ సత్యం.. జగన్ మిథ్య! ప్రస్తుతం మేధావులు అంటున్న మాట ఇదే! ఎందుకంటే.. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. సీఎం జగన్ పదే పదే తన పాలనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. తన పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెబుతున్నారు. గత నాలుగేళ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే.. జగన్కు ముందు.. కూడా రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు.
అంతెందుకు.. జగన్ తండ్రి వైఎస్ ఐదున్నర సంవత్సరాలు పాలించారు. ఇక, జగన్ తర్వాత కూడా.. అనేక మంది ముఖ్యమంత్రులు అవుతారు. జగన్తోనే ఏదీ ప్రారంభం కాలేదు.. ఆయనతోనే ఏదీ అంతమూ కాదు. ఇది నిరంతర ప్రక్రియ అని మేధావులు చెబుతున్నారు. అందుకే.. ఏపీ సత్యం అనే మాటను వారు వినిపిస్తున్నారు. తాజాగా గుడివాడలో పర్యటించిన సీఎం జగన్.. తన వల్లే అంతా జరుగుతున్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు.
స్వయం ప్రకటిత అద్భుత పాలనలో టిడ్కో గృహాలను తానే నిర్మించానని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. వాస్తవాన్ని జగన్ గుర్తించకపోయినా.. ప్రజలు గుర్తిస్తన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచి దని మేధావులు చెబుతున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు జరిగాయో.. ప్రజలకు, ముఖ్యంగా లబ్ధిదారులకు బాగానే తెలుసు. కానీ, తనను తాను పెద్దవాడిగా ఊహించుకుని.. తన హయాంలోనే నిర్మాణాలు పూర్తయ్యాయని జగన్ చెప్పడం సర్వత్రా విస్మయం కలిగిస్తోందని అంటున్నారు.
ఏదైనా చెబితే ప్రజలు నమ్మేలాగా ఉండాలని.. అలాకాదంటే.. నష్టం ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెండేళ్లపాటు.. కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. ఉపాధి రంగం, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరి ఆ రెండేళ్లను తీసేస్తే.. కేవలం రెండేళ్లలోనే టిడ్కో గృహాలు నిర్మించారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. చెప్పేవారు.. ఎలా ఉన్నా.. వింటున్న ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మేధావులు అంటున్నారు.
This post was last modified on June 18, 2023 9:55 am
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…