అనుకోని ఆపద ఎదురవుతుంది. సాయం కోసం అర్థిస్తుంటారు. కానీ.. ఎవరూ స్పందించరు. అలాంటి సమయంలో హీరో ఎంట్రీ ఇస్తారు. సాహసోపేతమైన చర్యలతో ఆపద నుంచి గట్టెక్కిస్తాడు. ఇలాంటివి సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటాం. రీల్ లో కనిపించే సాహసాలు రియల్ లో చాలా తక్కువగా కనిపిస్తాయి. అందునా.. ఇలాంటి సాహసాలు చేసేవారు సాదాసీదా సామాన్యులే తప్పించి.. ప్రముఖులు.. ప్రజాప్రతినిధులు పెద్దగా కనిపించరు. కానీ.. ఆ లోటును తీర్చారు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు.
అచ్చం సినిమాల్లో మాదిరి ఆపదలో ఉన్న వారిని రక్షించిన వైనం ఇప్పడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అతని వివరాల కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. గుజరాత్ లోని రాజుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు బీజేపీకి చెందిన హీరో సోలంకి. కోలి వర్గానికి చెందిన ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు కల్పేష్, విజయ్, నికుల్, జీవన్ అనే నలుగురు యువకులు స్నానం చేయటానికి సముద్రంలోకి వెళ్లారు.
అప్పటివరకు బాగానే ఉన్నా.. ఒక్కసారిగా ప్రవాహం పెరిగిపోవటం.. పెద్ద గాలి వీయటంతో వారంతా సముద్రంలోకి జారిపోయారు. ఆ వెంటనే భయంతో వారు కేకలు వేయటం మొదలు పెట్టారు.సముద్రం ఒడ్డున చాలామంది ఉన్నప్పటికీ.. ఎవరూవారిని సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వేళలో.. బీజేపీ ఎంపీ హీరా సోలంకి సముద్రంలోకి దూకి.. కొట్టుకు పోతున్న నలుగురిలో ముగ్గురిని కాపాడారు.
ఎమ్మెల్యేకు సాయం చేసేందుకు మరబోటు రావటం.. సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకుల్ని రక్షించి.. వారిని బోటులోకి ఎక్కించారు. అనంతరం ఆయన్నుబోటులోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకొచ్చారు. నలుగురు యువకుల్లో జీవన్ మాత్రం కొట్టుకుపోయారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం సాయంత్రం అతడి డెడ్ బాడీ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ ఉదంతంలో సాహసోపేతంగా వ్యవహరించిన బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకిని అభినందిస్తున్నారు.
This post was last modified on June 1, 2023 10:23 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…