అనుకోని ఆపద ఎదురవుతుంది. సాయం కోసం అర్థిస్తుంటారు. కానీ.. ఎవరూ స్పందించరు. అలాంటి సమయంలో హీరో ఎంట్రీ ఇస్తారు. సాహసోపేతమైన చర్యలతో ఆపద నుంచి గట్టెక్కిస్తాడు. ఇలాంటివి సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటాం. రీల్ లో కనిపించే సాహసాలు రియల్ లో చాలా తక్కువగా కనిపిస్తాయి. అందునా.. ఇలాంటి సాహసాలు చేసేవారు సాదాసీదా సామాన్యులే తప్పించి.. ప్రముఖులు.. ప్రజాప్రతినిధులు పెద్దగా కనిపించరు. కానీ.. ఆ లోటును తీర్చారు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు.
అచ్చం సినిమాల్లో మాదిరి ఆపదలో ఉన్న వారిని రక్షించిన వైనం ఇప్పడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అతని వివరాల కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. గుజరాత్ లోని రాజుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు బీజేపీకి చెందిన హీరో సోలంకి. కోలి వర్గానికి చెందిన ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు కల్పేష్, విజయ్, నికుల్, జీవన్ అనే నలుగురు యువకులు స్నానం చేయటానికి సముద్రంలోకి వెళ్లారు.
అప్పటివరకు బాగానే ఉన్నా.. ఒక్కసారిగా ప్రవాహం పెరిగిపోవటం.. పెద్ద గాలి వీయటంతో వారంతా సముద్రంలోకి జారిపోయారు. ఆ వెంటనే భయంతో వారు కేకలు వేయటం మొదలు పెట్టారు.సముద్రం ఒడ్డున చాలామంది ఉన్నప్పటికీ.. ఎవరూవారిని సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వేళలో.. బీజేపీ ఎంపీ హీరా సోలంకి సముద్రంలోకి దూకి.. కొట్టుకు పోతున్న నలుగురిలో ముగ్గురిని కాపాడారు.
ఎమ్మెల్యేకు సాయం చేసేందుకు మరబోటు రావటం.. సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకుల్ని రక్షించి.. వారిని బోటులోకి ఎక్కించారు. అనంతరం ఆయన్నుబోటులోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకొచ్చారు. నలుగురు యువకుల్లో జీవన్ మాత్రం కొట్టుకుపోయారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం సాయంత్రం అతడి డెడ్ బాడీ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ ఉదంతంలో సాహసోపేతంగా వ్యవహరించిన బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకిని అభినందిస్తున్నారు.
This post was last modified on June 1, 2023 10:23 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…