Political News

సిక్కుల పై జగన్ ఫోకస్ !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కులాల వారీగా.. మ‌తాల వారీగా విడిపోతున్న ఓటు బ్యాంకుకు ఇప్పుడు మ‌రో చేరిక వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా కులాల‌ను మ‌రింత‌గా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాష్ట్రంలో సిక్కు మ‌త‌స్తుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో  భాగంగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయా వర్గాల వారితో భేటీ నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. దీంతో సిక్కుల విష‌యం రాష్ట్రంలో తొలిసారి రాజ‌కీయ ప‌ర‌మైన పోల‌రైజేష‌న్‌కు జ‌గ‌న్ నాంది ప‌లికిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వాస్త‌వానికి రాష్ట్రంలో సిక్కుల ఓటు బ్యాంకు 2-4 శాతం ఉంది. అంటే.. వంద‌మందిలో ఇద్ద‌రు నుంచి న‌లుగురు మాత్ర‌మే వారు ఉన్నారు. మ‌రి వీరి ఓటు బ్యాంక‌పై ఇప్ప‌టి వ‌రకు కూడా ఎవ‌రూ దృష్టి పెట్ట‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో సిక్కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసిన‌.. చంద్ర‌బాబు.. మ‌ధ్య‌లోనే విర‌మించుకున్నారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం వంటి కొన్ని ప్రాంతాల్లోనే సిక్కులు ఉన్నారు.

వారు కూడా ఆటోమొబైల్‌, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నారు. దీంతో ఎందుకో గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా.. మ‌ధ్య‌లోనే వ‌దిలేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు సిక్కులు ఏపార్టీకి ఓటు వేస్తున్నారు? అనే అంచ‌నాలు ఎవ‌రికీ లేవు. పైగా.. వారుపోలింగు బూత్‌ల‌కు వ‌స్తున్న జాడ కూడా క‌నిపించ‌లేదు. కానీ, తొలిసారి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ వ‌ర్గం వారిపై దృష్టి పెట్టారు. అయితే.. ఇది కేవ‌లం .. సిక్కుల‌కు ఉద్దేశించిందేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎందుకంటే.. రాష్ట్రంలో ఉన్న సిక్కులు.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చారు. సో.. వారు ఆయా రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స ప్ర‌జ‌ల ఓట్ల‌ను కూడా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌నేది జ‌గ‌న్ భావ‌న కావొచ్చు. అందుకే వారు కోరిన వాటికి వెంట‌నే ఆమోదం తెలిపారు. ప్ర‌ధానంగా గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు, గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… నెల‌నెలా పింఛ‌న్లు,  గురునానక్‌ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడం గ‌మ‌నార్హం.

 మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించ‌డం వంటి సిక్కుల‌ను ఆకర్షించే ప్ర‌ధాన అస్త్రాలుగా మారాయి. ప్ర‌తి ఓటు కీల‌క‌మైన వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి వీరి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూరుతుందో చూడాలి. అయితే.. ప‌రిశీల‌కులు మాత్రం ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. రాష్ట్రంలో మ‌రింత‌గా కులాలు.. మ‌తాల వారీగా ప్ర‌జ‌లు విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాద‌ని అంటున్నారు.

This post was last modified on June 1, 2023 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

22 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

4 hours ago