Political News

ఏపీలో ముంద‌స్తు.. బీజేపీ గ్రీన్ సిగ్న‌ల్‌?

ఏపీపై బీజేపీ పెద్దల అభిప్రాయం ఏంటి? అసలు ఏపీని ఏ విధంగా వాళ్ళు డీల్ చేయాలి అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి అసలు బిజెపి పెద్దలు ఏపీలో పావులు కద‌పాలని గాని ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసిపి తమకు అనుకూలంగా ఉండడం వైసిపి నుంచి కావలసినవన్నీ జరుగుతుండటం బీజేపీకి క‌లిసివ‌స్తున్నాయి.

ఈ కారణంతో ఏపీలో ప్రభుత్వం అవసరం లేకపోయినా లోక్‌స‌భలో తమకు మద్దతు ఇచ్చే పార్టీ బలంగా ఉంటే చాలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో బిజెపి పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి వారు సహకరిస్తున్నారు అనేటటువంటి చర్చ కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ఇక ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యూహానికి బిజెపి పచ్చ జెండా ఊపింది అనేటటువంటి చర్చ తాజాగా తెర‌మీద‌కు వచ్చింది. నిజానికి బిజెపి పరిస్థితిని గమనిస్తే అధికారంలోకి వస్తాం అని పదే పదే చెబుతున్నటువంటి బిజెపి నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

కేవలం వైసీపీకి దన్నుగా ఉన్నారు అనేటటువంటి మాట పదే పదే వస్తున్నా దీనికి కూడా వారు సమాధానం చెప్పడం లేదు. మద్దతిస్తున్నారని మద్దతు ఇవ్వడం లేదని గాని స్పందించడం లేదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అప్పులు ఎక్కువగా ఇస్తున్నారు. అనుకూలంగా సహకరిస్తున్నారు అనేటటువంటి చర్చ అయితే జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికలను  ప్రాణంగా భావించే బీజెపి నాయకులు వచ్చే ఎన్నికల్లో ఏపీలో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో అయినా గెలుపొందాలి అనే వ్యూహం పెట్టుకున్నారు.

ఈ విష‌యాన్ని జాతీయ మీడియా కొన్నాళ్లుగా చెప్తోంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా కేవలం లోక్‌స‌భలో తమకు మద్దతు ఇచ్చేటటువంటి వైసీపీకి అండగా నిలవాలి అనేటటువంటి చర్చ తెర‌మీదికి వచ్చింది. ఇదే జరిగితే బిజెపికి కోలుకోలేనటువంటి దెబ్బ తగలడం ఖాయంగా ఉంది. జనసేన టిడిపితో కలిసి బిజెపికి ముందుకు వెళ్లినట్లైతే 2014లో సాధించినట్టుగా నాలుగైదు సీట్ల నుంచి అసెంబ్లీలో పార్లమెంటుకు ఒకటి రెండు స్థానాల్లో అయినా గెలుపొందే అవకాశం ఉంది.

కానీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు పచ్చ జెండా ఊపినట్లైతే బిజెపితో కలుస్తుందా లేదా అనేది మరో చర్చగా మారింది. ఇక పార్లమెంట్ విషయానికి వచ్చినట్టయితే వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలు దాదాపు బిజెపికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని చర్చ‌ ఉంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఏపీ ని వదిలేసుకుందా లేకపోతే ఏపీలో పావులు కద‌పాలని నిర్ణయించుకుందా అనేది కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అంచనాలు ప్రకారం వైసిపికి దన్నుగా నిలుస్తోంది అనేటటువంటి చర్చ‌ మాత్రం జరుగుతుంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో బిజెపి పెద్దగా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.  మరోవైపు ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి వైసీపీ ముందస్తు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు  స్పష్టంగా తెలుస్తుంది. ఇదే గనక జరిగితే రాష్ట్రంలో వైసిపి బిజెపిలు కలిసి పోటీ చేయకపోయినా వేరువేరుగా పోటీ చేసినా ఒకే మార్గంలో ఒకే దిశలో నడిచేటటువంటి అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

This post was last modified on June 1, 2023 1:18 pm

Share

Recent Posts

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

38 minutes ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

4 hours ago

రామాయణ 2 కోసం చాలా దాచి పెట్టారు

దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…

4 hours ago

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో…

4 hours ago

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

5 hours ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

5 hours ago