ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అనూహ్యంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గవర్నర్కు పంపి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఆ వెంటనే తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లడం చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయం హాట్గా మారింది.
అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని.. వైసీపీ నాయకులు చెబుతు న్నారు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 98.44 శాతం అమలు చేశామని పార్టీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదన్నది మెజారిటీ ఎమ్మెల్యేల మాటగా ఉంది. ముఖ్యంగా సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని.. వీరిని ఏదో ఒక రకంగా శాంతింపచేయకుండా వెళ్తే.. ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ఇక, పింఛన్లను రూ.3000 చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని.. ఇది కూడా అమలు చేయలేదని.. ఇప్పటికిప్పుడు.. ఈ హామీని నెరవేర్చకుండా.. ముందుకు సాగితే.. ఎలా? అనేది ఎమ్మెల్యేల మాట. మరో కీలకమైన విషయంపోలవరం. దీనిని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని.. కానీ, నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటికీ అమలు చేయలేకపోయామని చెబుతున్నారు.
అదేసమయంలో జిల్లాలను ఏర్పాటు చేసినా.. దీనికి రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేక పోయారు. దిశ చట్టాన్ని చేసినా.. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోలేక పోయారు. ఈ రెండు విషయాలు కూడా.. ఇప్పటికీ ప్రజల్లో చర్చకు వున్నాయని.. కాబట్టి.. ఇలాంటి కీలకమైన హామీల విషయంలో ఆచి తూచి ప్రజల దగ్గర మార్కులు వేయించుకోకుండా.. ముందుకు సాగితే ప్రమాదమేనని.. ముందస్తు ముంచేస్తుందని చాలా మంది గుసగుసలాడుతున్నారు.
This post was last modified on May 31, 2023 3:39 pm
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…