Political News

ముంద‌స్తుపై వైసీపీ నేత‌ల టాక్ ఇదే!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. వైసీపీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతు న్నారు. దీనికి ప్ర‌ధానంగా నాలుగు కార‌ణాలు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను 98.44 శాతం అమ‌లు చేశామ‌ని పార్టీ చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌న్న‌ది మెజారిటీ ఎమ్మెల్యేల మాట‌గా ఉంది. ముఖ్యంగా సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో ఉద్యోగులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. వీరిని ఏదో ఒక ర‌కంగా శాంతింప‌చేయ‌కుండా వెళ్తే.. ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇక‌, పింఛ‌న్ల‌ను రూ.3000 చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చామ‌ని.. ఇది కూడా అమ‌లు చేయ‌లేదని.. ఇప్ప‌టికిప్పుడు.. ఈ హామీని నెర‌వేర్చ‌కుండా.. ముందుకు సాగితే.. ఎలా? అనేది ఎమ్మెల్యేల మాట‌. మ‌రో కీల‌క‌మైన విష‌యంపోల‌వ‌రం. దీనిని అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని.. కానీ, నాలుగేళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేక‌పోయామ‌ని చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో జిల్లాల‌ను ఏర్పాటు చేసినా.. దీనికి రాష్ట్ర‌ప‌తి నుంచి ఆమోదం పొంద‌లేక పోయారు. దిశ చ‌ట్టాన్ని చేసినా.. కేంద్రం నుంచి అనుమ‌తి తెచ్చుకోలేక పోయారు. ఈ రెండు విష‌యాలు కూడా.. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వున్నాయ‌ని.. కాబ‌ట్టి.. ఇలాంటి కీల‌క‌మైన హామీల విష‌యంలో ఆచి తూచి ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మార్కులు వేయించుకోకుండా.. ముందుకు సాగితే ప్ర‌మాద‌మేన‌ని.. ముంద‌స్తు ముంచేస్తుంద‌ని చాలా మంది గుస‌గుస‌లాడుతున్నారు.

This post was last modified on May 31, 2023 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

17 minutes ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

23 minutes ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

2 hours ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

3 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

4 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

6 hours ago