వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి,ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి కాపులసెగ పట్టుకుంది. గుడివాడ నియోజక వర్గం నుంచి వరుసగా గెలుస్తున్న నానికి ఇక్కడ 32 శాతంగా ఉన్న కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. అయి తే.. అనూహ్యంగా ఇప్పుడు వారి నుంచే సెగ పెరుగుతుండడంతో కొడాలి వర్గం తర్జన భర్జనలో పడింది. తాజాగా కాపులు ఏకంగా కొడాలిపై విరుచుకుపడ్డారు.
కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేశాయి. కాపులను కులం పేరుతో దూషించడాన్ని ఐక్య కాపునాడు, కాపు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కులం పేరుతో బూతులు తిట్ట డాన్ని అన్ని వర్గాలు గమనిస్తున్నాయన్నారు.
రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుకో వాలని హితవు పలికారు. కొడాలి నానీని వైసీపీ కాపు నాయకులు ప్రశ్నించ డంతోపాటు కాపు సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలిపై పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కాపు జాతిని అవహేళన చేయడం ఆంధ్ర రాష్ట్రానికే అవమానమన్నారు.
కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ హెచ్చరించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. దీనిపైకొడాలి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 30, 2023 2:56 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…