వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి,ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి కాపులసెగ పట్టుకుంది. గుడివాడ నియోజక వర్గం నుంచి వరుసగా గెలుస్తున్న నానికి ఇక్కడ 32 శాతంగా ఉన్న కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. అయి తే.. అనూహ్యంగా ఇప్పుడు వారి నుంచే సెగ పెరుగుతుండడంతో కొడాలి వర్గం తర్జన భర్జనలో పడింది. తాజాగా కాపులు ఏకంగా కొడాలిపై విరుచుకుపడ్డారు.
కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేశాయి. కాపులను కులం పేరుతో దూషించడాన్ని ఐక్య కాపునాడు, కాపు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కులం పేరుతో బూతులు తిట్ట డాన్ని అన్ని వర్గాలు గమనిస్తున్నాయన్నారు.
రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుకో వాలని హితవు పలికారు. కొడాలి నానీని వైసీపీ కాపు నాయకులు ప్రశ్నించ డంతోపాటు కాపు సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలిపై పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కాపు జాతిని అవహేళన చేయడం ఆంధ్ర రాష్ట్రానికే అవమానమన్నారు.
కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ హెచ్చరించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. దీనిపైకొడాలి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 30, 2023 2:56 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…