తెలంగాణా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రిచ్చెస్ట్ రాజకీయ పార్టీ ఏదంటే ఎవరైనా బీఆర్ఎస్ అనే చెప్పాలి. ఆ పార్టీకి స్ధిర, చరాస్తులు విపరీతంగా పోగుపడుతున్నాయి. బ్యాంకుల్లో పార్టీ ఖాతాలో సుమారు రు. 760 కోట్లు ఉన్నట్లు కేసీయారే చెప్పారు. అందుకనే పార్టీ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొనుగోలు చేయాలని కేసీయార్ ఆ మధ్య చాలా ఆలోచనలు చేశారు. తర్వాత ఎందుకో ఆ జోరు తగ్గింది. ఇపుడిదంతా ఎందుకంటే ఈ మధ్యనే కోకాపేటలో విలువైన భూములను బీఆర్ఎస్ కు దక్కేట్లుగా కేసీయార్ నిర్ణయం తీసుకుని అమలుచేశారు.
అందుబాటులోని సమాచారం ప్రకారం బీఆర్ఎస్, స్ధిర, చరాస్తుల విలువ సుమారు రు. 1700 కోట్లుంటుందని అంచనా. కోకాపేటలో పార్టీకి దఖలు పడిన భూమి విలువే విపరీతంగా ఉందట. కోకాపేటలో పార్టీ కోసమని ప్రభుత్వం 11 ఎకరాలను కేటాయించింది. దీని విలువ ప్రస్తుతం మార్కెట్లో రు. 600 కోట్లుంటుంది. ఇక 24 జిల్లాల్లోను పార్టీ ఆఫీసులున్న స్ధలాల విలువ సుమారు రు. 200 కోట్లట. ఇదికాకుండా బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసు స్ధలం విలువ సుమారు రు. 130 కోట్లు. ఢిల్లీలోని ఆఫీసు భూమి విలువ సుమారు రు. 100 కోట్లు.
చరాస్తుల విలువ రు. 1200 కోట్లని ఇందులో బ్యాంకుల్లో నిల్వున్న క్యాషే సుమారు రు. 750 కోట్లుగా కేసీయరే ప్రకటించారు. దీని మీద నెలకు రు. 7 కోట్ల వడ్డీయే అందుతోంది. ఈ వడ్డీ డబ్బుతోనే పార్టీ ప్రచారం, మీడియాకు ఇచ్చే ప్రకటనలు సరిపోతోందట. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత రిచ్చెస్టు పార్టీ మరోటిలేదనే చెప్పాలి.
గతంలో పార్టీలు కూడా ప్రభుత్వ స్ధలాలనే పార్టీ ఆఫీసులకు కేటాయించుకున్నాయి. అయితే ఇంత పెద్దఎత్తున ఎకరాలకు ఎకరాలను కేటాయించుకోలేదు. ఇపుడు కేసీయార్ చేస్తున్నది ఏమిటంటే హైదరాబాద్ లోనే రెండుచోట్ల అత్యంత విలువైన బంజారాహిల్స్, కోకాపేటలో ప్రభుత్వ స్ధలాలను కేటాయించుకున్నారు. 2018 తర్వాతే పార్టీకి కోట్లాదిరూపాయల విలువైన ఆస్తులు సమకూరాయి. ఎలాగంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోను పార్టీ ఆఫీసుకు భవనం పేరుతో ప్రభుత్వ స్ధలాలను కేటాయించేసుకున్నారు. వాటికి అదనంగా ఇపుడు కోకాపేటలో అత్యంత విలువైన స్ధలం కూడా సొంతమైపోయింది.
This post was last modified on May 30, 2023 4:51 pm
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…