తెలంగాణా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రిచ్చెస్ట్ రాజకీయ పార్టీ ఏదంటే ఎవరైనా బీఆర్ఎస్ అనే చెప్పాలి. ఆ పార్టీకి స్ధిర, చరాస్తులు విపరీతంగా పోగుపడుతున్నాయి. బ్యాంకుల్లో పార్టీ ఖాతాలో సుమారు రు. 760 కోట్లు ఉన్నట్లు కేసీయారే చెప్పారు. అందుకనే పార్టీ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొనుగోలు చేయాలని కేసీయార్ ఆ మధ్య చాలా ఆలోచనలు చేశారు. తర్వాత ఎందుకో ఆ జోరు తగ్గింది. ఇపుడిదంతా ఎందుకంటే ఈ మధ్యనే కోకాపేటలో విలువైన భూములను బీఆర్ఎస్ కు దక్కేట్లుగా కేసీయార్ నిర్ణయం తీసుకుని అమలుచేశారు.
అందుబాటులోని సమాచారం ప్రకారం బీఆర్ఎస్, స్ధిర, చరాస్తుల విలువ సుమారు రు. 1700 కోట్లుంటుందని అంచనా. కోకాపేటలో పార్టీకి దఖలు పడిన భూమి విలువే విపరీతంగా ఉందట. కోకాపేటలో పార్టీ కోసమని ప్రభుత్వం 11 ఎకరాలను కేటాయించింది. దీని విలువ ప్రస్తుతం మార్కెట్లో రు. 600 కోట్లుంటుంది. ఇక 24 జిల్లాల్లోను పార్టీ ఆఫీసులున్న స్ధలాల విలువ సుమారు రు. 200 కోట్లట. ఇదికాకుండా బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసు స్ధలం విలువ సుమారు రు. 130 కోట్లు. ఢిల్లీలోని ఆఫీసు భూమి విలువ సుమారు రు. 100 కోట్లు.
చరాస్తుల విలువ రు. 1200 కోట్లని ఇందులో బ్యాంకుల్లో నిల్వున్న క్యాషే సుమారు రు. 750 కోట్లుగా కేసీయరే ప్రకటించారు. దీని మీద నెలకు రు. 7 కోట్ల వడ్డీయే అందుతోంది. ఈ వడ్డీ డబ్బుతోనే పార్టీ ప్రచారం, మీడియాకు ఇచ్చే ప్రకటనలు సరిపోతోందట. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత రిచ్చెస్టు పార్టీ మరోటిలేదనే చెప్పాలి.
గతంలో పార్టీలు కూడా ప్రభుత్వ స్ధలాలనే పార్టీ ఆఫీసులకు కేటాయించుకున్నాయి. అయితే ఇంత పెద్దఎత్తున ఎకరాలకు ఎకరాలను కేటాయించుకోలేదు. ఇపుడు కేసీయార్ చేస్తున్నది ఏమిటంటే హైదరాబాద్ లోనే రెండుచోట్ల అత్యంత విలువైన బంజారాహిల్స్, కోకాపేటలో ప్రభుత్వ స్ధలాలను కేటాయించుకున్నారు. 2018 తర్వాతే పార్టీకి కోట్లాదిరూపాయల విలువైన ఆస్తులు సమకూరాయి. ఎలాగంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోను పార్టీ ఆఫీసుకు భవనం పేరుతో ప్రభుత్వ స్ధలాలను కేటాయించేసుకున్నారు. వాటికి అదనంగా ఇపుడు కోకాపేటలో అత్యంత విలువైన స్ధలం కూడా సొంతమైపోయింది.
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…