Political News

కాంగ్రెస్ టార్గెట్ @150

కర్నాటక ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతులేని ఆత్మవిశ్వాన్ని నింపినట్లే ఉంది. అందుకనే ఈ ఏడాది చివరలో జరగబోతున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాదించాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని 230 సీట్లలో కాంగ్రెస్ 150 గెలుచుకుంటుందని అగ్రనేత రాహుల్ గాంధి చెప్పారు. ఇపుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు 96 సీట్లుంది. నిజానికి 2018 ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. కాకపోతే ముఖ్యమంత్రి పీఠం కోసం నేతల మధ్య జరిగిన గొడవలో ప్రభుత్వాన్ని తనంతట తానుగానే కూల్చేసుకున్నది.

ముఖ్యమంత్రి పోస్టుకోసం జ్యోతిరాధిత్య సింథియా పోరాడి లాభంలేదని తెలుసుకుని తన మద్దతుదారులతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటంతో అధికారం కుప్పకూలిపోయింది. ఎప్పుడైతే 27 మంది మద్దతుదారులతో సింథియా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి చేతులు కలిపారో వెంటనే ప్రతిపక్షంలో ఉన్న  బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. తాను సీఎం కాలేకపోయినా కమలనాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సింథియా కూల్చగలిగారు.

సరే చరిత్రను వదిలేస్తే తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే హస్తంపార్టీ నేతలు అనుకుంటున్నారు. టికెట్ల కేటాయింపు, ప్రచారం, సంక్షేమపథకాల విషయంలో ఇవ్వాల్సిన హామీలపై కర్నాటకలో అమలుచేసిన ఫార్ములానే మధ్యప్రదేశ్ లో కూడా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే అధ్యక్షతన రాహుల్, మాజీ ముఖ్యమంత్రులు కమలనాధ్, దిగ్విజయ్ సింగ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు రాష్ట్రంలోని కీలక నేతలు సమావేశమయ్యారు.

నరేంద్రమోడీ పరిపాలన దేశానికి ఏ విధంగా ప్రమాదకరమో జనాలందరికీ వివరించాలని సమావేశంలో తీర్మానంచేశారు. అభ్యర్ధుల ప్రకటన కూడా ముందుగానే జరిగిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలో అగ్రనేతలంతా కలిసికట్టుగా ఉండాలని, చేసే ప్రచారం, ఇచ్చేహామీలు గ్రామీణప్రాంతాల్లోని చివరి జనాలకు కూడా చేరాలన్నది కీలకమైన పాయింట్. మోడీ పాలన మీద దేశవ్యాప్తంగా మొదలైన వ్యతిరేకతను ఎంత వీలైతే అంత అడ్వాంటేజ్ తీసుకోవాలన్నది ప్రధానమైన టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్నీ పరిస్ధితులను భేరీజు వేసుకున్నారకే కాంగ్రెస్ కు 150 సీట్లు వస్తాయని రాహుల్ ఫిక్సయ్యారు. 

This post was last modified on May 30, 2023 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

4 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

5 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

7 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

7 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

8 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

9 hours ago