రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబునాయుడు ప్రయత్నం. అధికారంలోకి రాకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటో మిగిలిన వారికన్నా చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు. అందుకనే 74 ఏళ్ళ వయసులో కూడా శ్రమ అనుకోకుండా రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నది. ఒకవైపు చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తుండగానే మరోవైపు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర రాయలసీమలో జరుగుతోంది. మహానాడు సందర్భంగా నాలుగురోజులు విరామమిచ్చారు.
మహానాడులో లోకేష్ మాట్లాడుతు రాయలసీమకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు చెప్పారు. తొందరలోనే రాయలసీమ కోసం ప్రత్యేకంగా రోడ్డుమ్యాపు రెడీ చేస్తామన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే 52 సీట్లలో వైసీపీ 49 నియోజకవర్గాల్లో గెలిచింది. కుప్పం, హిందుపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కనీసం సగం సీట్లయినా గెలవాలన్నది చంద్రబాబు టార్గెట్ .
ఇందుకని ముఖ్యంగా యువత అందులోను రెడ్డి సామాజికవర్గం నుండి గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాయలసీమ మొత్తంమీద రెడ్డి సామాజికవర్గందే డామినేషన్ అని అందరికీ తెలిసిందే. అనంతపుర, కర్నూలు, కడప, చిత్తూరు ఇలా ఏ జిల్లా చూసినా వాళ్ళదే పైచేయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గంలోని బలమైన నేతలను పోటీలోకి దింపాలని చంద్రబాబు అనుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటివరకు టికెట్లు ప్రకటించిన నేతల్లో కూడా రెడ్లే అత్యధికంగా ఉన్నారు.
రెడ్ల తర్వాత బీసీలు, బలిజలు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి రెడ్డి-బీసీ-బలిజ సామాజికవర్గాల కాంబినేషన్లో టికెట్లిచ్చి గట్టి నేతలను పోటీలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచన. కర్నూలు, అనంతపురంలో రెడ్లతో పాటు బీసీ సామాజికవర్గం కూడా ఎక్కువే. ఇక కడపలో దాదాపు రెడ్లదే పైచేయి. మిగిలిన చిత్తూరులో రెడ్లతో పాటు కమ్మ, బలిజలు కూడా ఉన్నారు. కాకపోతే కమ్మ ఆధిపత్యం తక్కువనే చెప్పాలి. అందుకనే రెడ్డి, బలిజ సామాజికవర్గమే ఎక్కువగా కనబడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే లోకేష్ తొందరలోనే రాయలసీమ రోడ్డుమ్యాపని చెప్పింది.
This post was last modified on May 28, 2023 4:10 pm
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…