విశాఖపట్నం సిటీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ తీవ్ర టెన్షన్ రేపుతోంది. వైసీపీ ఫ్లెక్సీల ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాక్షస పాలన అంతం.. ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలను తయారీ చేయించారు. జగన్ షర్ట్పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీని జనసేన ఏర్పాటు చేసింది.
సిరిపురం వీఐపీ రోడ్లో పక్కపక్కనే ఇరువర్గాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల వైసీపీ నాయకులు పవన్కు, నాగబాబుకు యాంటీగా ఫ్లెక్సీలు వేశారు. గత కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్.. సీఎం జగన్పై కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదిగా ఆయన విరుచుకుపడుతున్నారు. పాపం పసివాడు.. దొంగలకు దొంగ సినిమా టైటిళ్లను ప్రస్తావిస్తూ.. జగన్పై విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో వైసీపీ కూడా ఎదురు దాడి చేస్తోంది. టీడీపీ కోసమే జనసేన ఏర్పాటు చేశారని, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ అని.. రేటు కోసం.. బేరాలు ఆడుతున్నారని.. పేర్కొంటూ వైసీపీ నేతలు.. కూడా పపలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో తాజాగా ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య తీవ్ర పొలిటికల్ ఫైట్ చేసుకోవడం గమనార్హం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on May 28, 2023 1:32 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…