Political News

ప్రజాదరణ సీఎంలలో ర్యాంకులో దూసుకెళ్లిన ఏపీ సీఎం జగన్

దేశంలో చాలానే మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. రాజకీయ అంశాలకు సంబంధించి నిర్వహించే సర్వేలలో ఇండియా టుడే గ్రూపుకు ఉన్న విశ్వసనీయతను ఎవరూ తక్కువ చేయలేరు.

తరచూ వారు.. వివిధ సర్వేల్ని నిర్వహిస్తుంటారు. తాజాగా ఆ మీడియా సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకు సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. జులై 15 నుంచి 27 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

దేశంలో అత్యంత ప్రజాదరణ చెందిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచారు. రెండోస్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.

జులై 15 నుంచి 27 మధ్య కాలంలో దాదాపు 12,021 మందిని ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మరి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ర్యాంకు మాటేమిటి? అంటారా? అక్కడికే వస్తున్నా.

ఈ సర్వేలో కేసీఆర్ ర్యాంకు తొమ్మిదో స్థానంగా పేర్కొన్నారు. కరోనా మొదట్లో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా మారుమోగగా.. తర్వాతి కాలంలో ఆయన పనితీరుపై పెదవి విరుపు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి తగ్గట్లే.. తాజా ఫలితం ఉండటం గులాబీ బాస్ కాస్త గుర్రుగా ఉండే అవకాశం ఉందంటున్నారు.

This post was last modified on August 8, 2020 9:47 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago