దేశంలో చాలానే మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. రాజకీయ అంశాలకు సంబంధించి నిర్వహించే సర్వేలలో ఇండియా టుడే గ్రూపుకు ఉన్న విశ్వసనీయతను ఎవరూ తక్కువ చేయలేరు.
తరచూ వారు.. వివిధ సర్వేల్ని నిర్వహిస్తుంటారు. తాజాగా ఆ మీడియా సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకు సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. జులై 15 నుంచి 27 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
దేశంలో అత్యంత ప్రజాదరణ చెందిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచారు. రెండోస్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
జులై 15 నుంచి 27 మధ్య కాలంలో దాదాపు 12,021 మందిని ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మరి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ర్యాంకు మాటేమిటి? అంటారా? అక్కడికే వస్తున్నా.
ఈ సర్వేలో కేసీఆర్ ర్యాంకు తొమ్మిదో స్థానంగా పేర్కొన్నారు. కరోనా మొదట్లో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా మారుమోగగా.. తర్వాతి కాలంలో ఆయన పనితీరుపై పెదవి విరుపు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి తగ్గట్లే.. తాజా ఫలితం ఉండటం గులాబీ బాస్ కాస్త గుర్రుగా ఉండే అవకాశం ఉందంటున్నారు.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…