Political News

రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..

ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం  ఇప్పుడు దేశ  ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను  వదిలించుకునేందుకు  జనం  నానా తంటాలు  పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల  డిపాజిట్ దాటితే  ప్యాన్ నెంబర్  తప్పనిసరి అని రిజర్వ్  బ్యాంక్ ప్రకటించడం జనానికి  ఇబ్బందేనని చెబుతున్నారు. దానితో 2016 నాటి పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

2023 మార్చి నాటికి, చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా 10.8%, వాటి మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చిలో గరిష్టంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్ల చలామణీలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో చాలావరకు రూ. 2,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల డిపాజిట్ బేస్ తో  పాటు  సిస్టమ్ లిక్విడిటీ మెరుగు పడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా, బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.  

బ్యాంకుల్లోకి వచ్చే రూ.2 వేల నోట్ల సొమ్ములో 40 నుంచి యాభై  శాతం అంటే దాదాపుగా రూ. 90 వేల కోట్ల వరకు దీర్ఘకాలిక డిపాజిట్లుగా మారతాయని  అంచనా వేస్తున్నారు బ్యాంకులు కొత్త రుణాలిచ్చి లాభాలు పొందేందుకు వారి వద్ద ఇబ్బడి ముబ్బడిగా నిధులుంటాయి. దానితో బ్యాంకుల ఆర్థిక స్థితి, లాభాలు మెరుగు పడే ఛాన్సుంది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ మాత్రమే జరుగుతోందని, చెలమాణి కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ జనంలో భయం మాత్రం కొనసాగడం ఖాయం. ఆ నోట్లను ఏదో విధంగా బ్యాంకులకు చేర్చడం అంతే ఖాయం.

This post was last modified on May 23, 2023 10:16 am

Share
Show comments
Published by
Satya
Tags: 2000 notes

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago