ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను వదిలించుకునేందుకు జనం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల డిపాజిట్ దాటితే ప్యాన్ నెంబర్ తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం జనానికి ఇబ్బందేనని చెబుతున్నారు. దానితో 2016 నాటి పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
2023 మార్చి నాటికి, చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా 10.8%, వాటి మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చిలో గరిష్టంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్ల చలామణీలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో చాలావరకు రూ. 2,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల డిపాజిట్ బేస్ తో పాటు సిస్టమ్ లిక్విడిటీ మెరుగు పడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా, బ్యాంక్ డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
బ్యాంకుల్లోకి వచ్చే రూ.2 వేల నోట్ల సొమ్ములో 40 నుంచి యాభై శాతం అంటే దాదాపుగా రూ. 90 వేల కోట్ల వరకు దీర్ఘకాలిక డిపాజిట్లుగా మారతాయని అంచనా వేస్తున్నారు బ్యాంకులు కొత్త రుణాలిచ్చి లాభాలు పొందేందుకు వారి వద్ద ఇబ్బడి ముబ్బడిగా నిధులుంటాయి. దానితో బ్యాంకుల ఆర్థిక స్థితి, లాభాలు మెరుగు పడే ఛాన్సుంది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ మాత్రమే జరుగుతోందని, చెలమాణి కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ జనంలో భయం మాత్రం కొనసాగడం ఖాయం. ఆ నోట్లను ఏదో విధంగా బ్యాంకులకు చేర్చడం అంతే ఖాయం.
This post was last modified on May 23, 2023 10:16 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…