Political News

రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..

ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం  ఇప్పుడు దేశ  ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను  వదిలించుకునేందుకు  జనం  నానా తంటాలు  పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల  డిపాజిట్ దాటితే  ప్యాన్ నెంబర్  తప్పనిసరి అని రిజర్వ్  బ్యాంక్ ప్రకటించడం జనానికి  ఇబ్బందేనని చెబుతున్నారు. దానితో 2016 నాటి పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

2023 మార్చి నాటికి, చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా 10.8%, వాటి మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చిలో గరిష్టంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్ల చలామణీలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో చాలావరకు రూ. 2,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల డిపాజిట్ బేస్ తో  పాటు  సిస్టమ్ లిక్విడిటీ మెరుగు పడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా, బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.  

బ్యాంకుల్లోకి వచ్చే రూ.2 వేల నోట్ల సొమ్ములో 40 నుంచి యాభై  శాతం అంటే దాదాపుగా రూ. 90 వేల కోట్ల వరకు దీర్ఘకాలిక డిపాజిట్లుగా మారతాయని  అంచనా వేస్తున్నారు బ్యాంకులు కొత్త రుణాలిచ్చి లాభాలు పొందేందుకు వారి వద్ద ఇబ్బడి ముబ్బడిగా నిధులుంటాయి. దానితో బ్యాంకుల ఆర్థిక స్థితి, లాభాలు మెరుగు పడే ఛాన్సుంది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ మాత్రమే జరుగుతోందని, చెలమాణి కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ జనంలో భయం మాత్రం కొనసాగడం ఖాయం. ఆ నోట్లను ఏదో విధంగా బ్యాంకులకు చేర్చడం అంతే ఖాయం.

This post was last modified on May 23, 2023 10:16 am

Share
Show comments
Published by
Satya
Tags: 2000 notes

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago