Political News

ఈ సారి కూడా టీడీపీ ఓడిపోతే..

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అయితే.. పాల‌న ప్రారంభించి నాలుగేళ్లు జ‌రిగిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అభివృద్దీ లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో లెక్క‌కు మించిన‌ అప్పులు చేస్తున్నార‌ని.. మ‌ద్య నిషేధం చేస్తామ‌ని న‌మ్మించి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేద‌ని.. విప‌క్షాలు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌ధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏపీనేన‌ని కూడా మేదావుల నుంచి రాజ‌కీయ విశ్లేష‌కుల వ‌ర‌కు అంద‌రూ చెబుతున్నారు.

అయితే..తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షసి పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి చంద్రబాబు కానీ, టీడీపీ కానీ, ఓడిపోతే పార్టీకి, చంద్ర‌బాబుకు జ‌రిగే న‌ష్టం ఏమీలేద‌ని. పార్టీ ప్ర‌జ‌ల కోసం అంకిత భావంతోనే ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్ర‌జ‌లే ఒక సారి ఆలోచించుకోవాల‌ని అన్నారు. ఇప్ప‌టికే నానా ర‌కాల ప‌న్నుల‌తో ప‌డుతూ లేస్తూ ఉన్న కుటుంబాలు.. జ‌గ‌న్ బాదుడును భ‌రించ‌లేక‌.. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందేనన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్ర‌జ‌లు ఏ గ‌ట్టున ఉంటారో నిర్ణ‌యించుకోవాల‌ని అచ్చెన్నాయుడు సూచించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. కేసును తప్పు దారి పట్టిస్తూ సీబీఐతో ఆడుకుంటున్నార‌ని అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. సీబీఐ వ్యవస్థపై నమ్మకం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

మహానాడుకు ప్రజలంతా తరలి రావాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. ఏ తప్పు చేయని తనను అరెస్టు చేసి, తన బాబాయ్ హత్య కేసులో నిందితుడైన తమ్ముడిని అరెస్టు చెయ్యనియ్య కుండా సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నా రని ప‌రోక్షంగా ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్‌పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

This post was last modified on May 23, 2023 7:47 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

36 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago