హైదరాబాద్ కు మరో ఆకర్షణ చేరనుంది. కాకుంటే.. దీన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తాజాగా హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు.
శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తుండటం ఒక ఎత్తు అయితే.. అందులో 50 కార్యక్రమాలు అమెరికాలోని 50 నగరాల్లో నిర్వహిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలుగు వారి సత్తాను చాటేందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తోడ్పడుతుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు ముందు తెలుగు వారికి ఎలాంటి గుర్తింపు లేదని.. అలాంటిది ఈ రోజున అమెరికాలో 20వ భాషగా తెలుగుకు గుర్తింపు దక్కిందంటే దానికి ఎన్టీఆర్ కల్పించిన స్ఫూర్తిగా చంద్రబాబు చెప్పారు.
భావి తరాల కోసం ఎన్టీఆర్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని.. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కు భారతరత్న పురస్కారం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. శతజయంతి వేడుకల్ని ఎలాంటి లోపం లేకుండా గొప్పగా చేశారంటూ నిర్వాహకుల్ని ప్రశంసించారు చంద్రబాబు. చైనాతోయుద్ధం వస్తే యువతలో దేశభక్తి నింపేందుకు పలు కార్యక్రమాల్నిచేశారని.. దివిసీమకు ఉప్పెన వచ్చి.. కొన్ని వేల మంది చనిపోతే జోలె పట్టి ప్రజలకు సాయం చేశారన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అంటూ కీర్తించిన చంద్రబాబు.. తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతారన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని.. దాన్ని సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు.. సినిమా రంగానికి చెందిన వారు హాజరుకావటం ఆసక్తికరంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:38 pm
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…