హైదరాబాద్ కు మరో ఆకర్షణ చేరనుంది. కాకుంటే.. దీన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తాజాగా హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు.
శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తుండటం ఒక ఎత్తు అయితే.. అందులో 50 కార్యక్రమాలు అమెరికాలోని 50 నగరాల్లో నిర్వహిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలుగు వారి సత్తాను చాటేందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తోడ్పడుతుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు ముందు తెలుగు వారికి ఎలాంటి గుర్తింపు లేదని.. అలాంటిది ఈ రోజున అమెరికాలో 20వ భాషగా తెలుగుకు గుర్తింపు దక్కిందంటే దానికి ఎన్టీఆర్ కల్పించిన స్ఫూర్తిగా చంద్రబాబు చెప్పారు.
భావి తరాల కోసం ఎన్టీఆర్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని.. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కు భారతరత్న పురస్కారం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. శతజయంతి వేడుకల్ని ఎలాంటి లోపం లేకుండా గొప్పగా చేశారంటూ నిర్వాహకుల్ని ప్రశంసించారు చంద్రబాబు. చైనాతోయుద్ధం వస్తే యువతలో దేశభక్తి నింపేందుకు పలు కార్యక్రమాల్నిచేశారని.. దివిసీమకు ఉప్పెన వచ్చి.. కొన్ని వేల మంది చనిపోతే జోలె పట్టి ప్రజలకు సాయం చేశారన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అంటూ కీర్తించిన చంద్రబాబు.. తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతారన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని.. దాన్ని సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు.. సినిమా రంగానికి చెందిన వారు హాజరుకావటం ఆసక్తికరంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:38 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…