హైదరాబాద్ కు మరో ఆకర్షణ చేరనుంది. కాకుంటే.. దీన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తాజాగా హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు.
శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తుండటం ఒక ఎత్తు అయితే.. అందులో 50 కార్యక్రమాలు అమెరికాలోని 50 నగరాల్లో నిర్వహిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలుగు వారి సత్తాను చాటేందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తోడ్పడుతుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు ముందు తెలుగు వారికి ఎలాంటి గుర్తింపు లేదని.. అలాంటిది ఈ రోజున అమెరికాలో 20వ భాషగా తెలుగుకు గుర్తింపు దక్కిందంటే దానికి ఎన్టీఆర్ కల్పించిన స్ఫూర్తిగా చంద్రబాబు చెప్పారు.
భావి తరాల కోసం ఎన్టీఆర్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని.. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కు భారతరత్న పురస్కారం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. శతజయంతి వేడుకల్ని ఎలాంటి లోపం లేకుండా గొప్పగా చేశారంటూ నిర్వాహకుల్ని ప్రశంసించారు చంద్రబాబు. చైనాతోయుద్ధం వస్తే యువతలో దేశభక్తి నింపేందుకు పలు కార్యక్రమాల్నిచేశారని.. దివిసీమకు ఉప్పెన వచ్చి.. కొన్ని వేల మంది చనిపోతే జోలె పట్టి ప్రజలకు సాయం చేశారన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అంటూ కీర్తించిన చంద్రబాబు.. తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతారన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని.. దాన్ని సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు.. సినిమా రంగానికి చెందిన వారు హాజరుకావటం ఆసక్తికరంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:38 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…