Political News

చంద్రబాబు “సమాధి” వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

శ్మశానం వర్సెస్ సమాధి ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. రెండు రోజుల క్రితం ఇదేమి ఖర్మ  మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను పట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా ప్రచారకులు తెగ గోల చేస్తున్నారు. దానికి టీడీపీ కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా కౌంటరిచ్చేస్తున్నారు..

సెంటు భూమితో మీరేమి చేసుకుంటారు…  సమాధి కట్టుకుంటారా అన్నది చంద్రబాబు ప్రసంగంలో ఒక వాక్యం.  పేదల  ఇళ్ల స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చారని అది ఏ విధంగానూ సహేతుకం కాదన్నది ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. చంద్రబాబు తొందరపడి ఒక మాట అన్నారని కూడా విశ్లేషణలు  వినిపిస్తున్నాయి. సెంటు భూమి పథకంపై విమర్శలు చేయడంతో పాటు  పేదలకు  ఇకాస్త భూమి ఇవ్వాలన్న డిమాండ్ లో తప్పులేదని అయితే ఏకంగా సమాధులు అనే పద ప్రయోగం ఆమోద యోగ్యం కాదని కొందరి వాదన.

వైసీపీ మంత్రులు కూడా ఇప్పుడు చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. రాజధాని  ప్రాంతంలోని పేదల పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారని, ఆయన  తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి మేరుగు  నాగార్జున డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని  శ్మశానం అని అన్న మాటలు మాత్రం వైసీపీ వారికి గుర్తుకు రావడం లేదు. బొత్స ఆ ఉద్దేశంతో అని ఉండరన్నది మేరుగు నాగార్జున సహా పలువురు  వైసీపీ  నేతల వివరణ.  

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

6 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

6 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

7 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

7 hours ago