ఎన్టీఆర్ కొత్త సినిమాకు కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న టైటిలే ఖాయమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘దేవర’ అనే పేరునే ప్రకటించారు. ఈ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ కూడా అదిరింది అనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. కాకపోతే ఈ టైటిల్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే అంత సంతృప్తిగా లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ‘దేవర’ అనే పేరు విషయంలో వాళ్లు కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు.
వాళ్లకు అలాంటి కనెక్షన్ ఏర్పడేలా చేసింది పవన్ వీరాభిమానుల్లో ఒకరైన నిర్మాత బండ్ల గణేషే. ఎన్నో ఏళ్ల నుంచి పవన్ను అతను దేవర దేవర అని సంబోధిస్తూ వస్తున్నాడు. ఈ టైటిల్తో పవన్తో ఓ సినిమా తీయాలని కూడా బండ్ల అనుకున్నాడు. ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించాడు కానీ.. రెన్యువల్ చేయించడం మరిచిపోయాడు. ఈలోపు కొరటాల తన సినిమాకు ఈ టైటిల్ అనుకోవడం.. రిజిస్టర్ చేయించడం.. ఇప్పుడు అదే పేరునే ప్రకటించడం జరిగిపోయాయి.
‘దేవర’ టైటిల్ను తారక్ సినిమాకు ప్రకటించడంపై బండ్ల గణేష్ కొంత అసహనంతోనే ట్వీట్ వేశాడు. ‘‘దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు’’ అని యాంగ్రీ ఎమోజీ జోడించి ట్వీట్ వేశాడు బండ్ల. ఐతే ఈలోపు ఎన్టీఆర్ అభిమానులు టార్గెట్ చేయడం వల్లో ఏమో.. దీనిపై క్లారిటీ ఇస్తూ ఇంకో ట్వీట్ వేశాడు. “నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే” అంటూ లవ్ ఎమోజీ జోడించాడు.
ఎన్టీఆర్తో బండ్ల గణేష్ ‘బాద్షా’, ‘టెంపర్’ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య మంచి అనుబంధమే ఉండేది. ఇక కొరటాల దర్శకత్వంలోనూ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టి ఆపేశాడు. మరి ఈ విషయంలో కొరటాల మీద అసహనంతో ట్వీట్ వేసి.. తర్వాత సర్దుకున్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్ల కిందటే సినిమా నిర్మాణం ఆపేసిన బండ్ల.. తిరిగి ఓ భారీ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు కానీ.. పెద్ద హీరోలెవరూ అతడికి డేట్లు ఇచ్చే సంకేతాలు కనిపించడం లేదు.
This post was last modified on May 20, 2023 9:56 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…