Political News

ఏటా 500 కోట్లకు స్కెచ్ గీశారు

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మ‌ద్యం విధానం కుంభ‌కోణంపై తాజాగా సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. ఏటా 500 కోట్ల‌ను రాబ‌ట్టుకునేలా.. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్కెచ్ గీశార‌ని ఆరోపించింది. కుంభ‌కోణంలో ఆయ‌న పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో  చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిని విచారణకు స్వీకరించే విష‌యాన్ని కోర్టు వాయిదా వేసింది.

తాజాగా సీబీఐ చేసిన రూ.500 కోట్ల ఆరోప‌ణ‌ల‌తో అస‌లు.. మ‌ద్యం విధానం ఏంటి?  ఒక్క‌రికే అంటే సిసోడి యాకే రూ.500 కోట్లు వ‌స్తాయా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. 2021లో ప్రవేశపెట్టిన ఈ మ‌ధ్యం పాల‌సీ అనేక విధాల వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ అనుమానం వ్య‌క్తం చేయ‌డం.. త‌న కు ఉన్న అధికారాల‌తో కేంద్రానికి లేఖ రాయ‌డంతో.. సీబీఐ, ఈడీ కూడా రంగంలోకి దిగాయి. ఈ క్ర‌మంలో మంత్రి మ‌నీష్‌ను అరెస్టు చేశారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా ప్ర‌శ్నించారు.

అస‌లేంటీ విధానం..
తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో అస‌లు ఢిల్లీ లిక్క‌ర్ విధానం ఏంటి? ఎందుకు వివాదానికి కార‌ణ‌మైంద‌నే విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిని ప‌రిశీలిస్తే.. ఆస‌క్తికర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి.

+ ఈ విధానంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండ‌దు
+ కేవలం ప్రైవేటు దుకాణాల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జ‌రుగుతాయి
+ ఇత‌ర  రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా.. ఇక్క‌డ మద్యం విక్ర‌యించుకోవ‌చ్చు.
+ న‌కిలీ మ‌ద్యం, బ్లాక్ వ్యాపారం వంటివాటిని నిలువ‌రిస్తారు
+ ప్ర‌భుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ప్ర‌ధాన వ్య‌వ‌హారం.
+ లిక్క‌ర్ ను డోర్ డెలివ‌రీ చేస్తారు.
+ దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరచి ఉంచ‌వ‌చ్చు
+ అపరిమితమైన డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చు

This post was last modified on May 20, 2023 8:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

8 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

11 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

39 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago