Political News

కాంగ్రెస్ సాధికారతకు  రూ.50 వేల కోట్లు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇచ్చిన  హామీలు నిలబెట్టుకునే టైమ్ వచ్చేసింది.  మొత్తం ఐదు ఉచిత హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడా హామీలే హస్తం పార్టీకి గుదిబండగా  మారే ప్రమాదం ఏర్పడింది. అవి అసలు  హామీలే కావని సాధికారతా ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్ష్మి క్రింద మహిళలకు నెలకు రూ.2,000, అన్న భాగ్య పథకం కింద పేదలకు నెల నెల 10 కిలోల బియ్యం, యువ నిధి కింది  రూ. 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం  లాంటి హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.

ఆ ఐదు హామీల భారం ఏడాదికి రూ. 50,000 వేల కోట్లు ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్  మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కేఈ రాధాకృష్ణన్ చెబుతున్నారు. పైగా ఆ మొత్తం చాలా తక్కువేనని ఆయన వాదన. కర్ణాటక ఏడాది బడ్జెట్ రూ.3 లక్షల కోట్లని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అందులో రూ.50 వేల కోట్లు పంచిపెట్టడం సులువేనని కాంగ్రెస్ అంటోంది..

మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల్లో కొన్ని పాతవేనని కాంగ్రెస్ చెబుతోంది. గతంలో ఏడు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేవారని, బీజేపీ దాన్ని ఐదు కిలోలకు తగ్గించిందని, ఇప్పుడు పది కిలోలకు పెంచడం ఒక్కటే తాము చేసిన మార్పు అని కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి పెరిగిపోయి మిగులును ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నామని దాన్ని మాత్రమే ప్రజలకు ఇచితంగా అందిస్తామని పార్టీ అంటోంది.

This post was last modified on May 20, 2023 8:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

59 minutes ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

2 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

2 hours ago

మీ తీరు మార‌దా?: ‘ఈడీ’పై తొలిసారి సుప్రీంకోర్టు ఆగ్ర‌హం!

కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.…

3 hours ago

‘విష’ ప్ర‌చారానికి ప‌నితీరే విరుగుడు బాబు గారూ..!

కూట‌మి ప్ర‌భుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేసిందన్న విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే..…

3 hours ago

ఖాతాలు అప్ డేట్ చేసుకోండి.. ఏపీ స‌ర్కారు ఎనౌన్స్‌మెంట్

"మీ మీ బ్యాంకు ఖాతాల‌ను మ‌రోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని అన్న దాత‌ల‌కు సూచించింది.…

3 hours ago