Political News

ట్విట్ట‌ర్ యుద్ధం స‌రే.. క్షేత్ర‌స్థాయి యుద్ధం ఏదీ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ స‌ర్కారుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా యుద్ధం చేస్తున్నారు. గ‌త నాలుగు రోజు లుగా మూడు ట్వీట్ల‌తో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తొలిరోజు పాపం ప‌సివాడు అంటూ.. ఓల్డ్ సినిమా పోస్ట‌ర్‌తో ఏకేశాడు. రెండో రాజు దొంగ‌ల‌కు దొంగ సినిమా టైటిల్‌తో విరుచుకుప‌డ్డారు.అదేస‌మ‌యంలో వీడియోల‌తో నూ విమ‌ర్శ‌లుగుప్పించారు. ఇక‌, తాజాగా శుక్ర‌వారం.. అన్న‌మ‌య్య డ్యాం కుప్ప‌కూలిన త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌పై ప్ర‌శ్న‌లు సంధించారు.

అయితే.. ఇదంతా బాగానే ఉన్నా..క్షేత్ర‌స్థాయిలో ఈ ట్వీట్ల‌యుద్ధం.. కామెంట్లు.. విమ‌ర్శ‌లు ఏమేర‌కు ప్ర‌జ ల‌కు చేరువ అవుతాయ‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ఏడాది కూడా స‌మ‌యం లేదు. ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. ఇవే విష‌యాల‌ను స్వ‌యంగా వారికి వివ‌రిస్తే.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పోనీ.. ఆయ‌న బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌ర‌పున పార్టీ కీల‌క నాయ‌కులను అయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పంపించే ప్ర‌యత్నం చేయాల‌ని సూచిస్తున్నారు.

కేవ‌లం గూటిలోనిచిల‌క మాదిరిగా ఎన్ని పలుకులు ప‌లికినా.. ప్ర‌యోజ‌నం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పైగా.. రాష్ట్రంలో ఫోన్లు వినియోగించేందుకు 60 శాతం మంది ఉన్నా.. వీరిలో ఎంత‌మంది ఈ ట్వీట్లు చూసి అర్ధం చేసుకుంటారు. ఇక‌, గ్రామీణ స్థాయిలో అయితే.. ఇది మ‌రింత త‌క్కువ‌గా ఉంది. సో.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇలా డిజిట‌ల్ ప్ర‌చారానికే ప‌రిమితం కావ‌డం వ‌ల్ల ప‌వ‌న్‌కు ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి ఇప్ప‌టికైనా.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

This post was last modified on May 19, 2023 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

18 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago