Political News

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఇలా జ‌రిగిందా?  వైసీపీలో క‌ల‌క‌లం!

క‌ర్ణాట‌కలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఊహించ‌ని విధంగా విజ‌యం అందుకుంది. నిజాని కి కాంగ్రెస్ నాయ‌కులు కూడా ఈ త‌ర‌హా అంచ‌నాలు వేయ‌లేదు. మ‌హా వ‌స్తే.. 115-120 మ‌ధ్యే ఆగిపోయారు. అది కూడా ఒక‌రిద్ద‌రే. కానీ, 39 ఏళ్ల చ‌రిత్ర‌నుతిర‌గ‌రాసిన క‌న్న‌డ ఓట‌రు ఏకంగా.. 136 స్థానాల్లో హ‌స్తం పార్టీ కి ఓట్ల‌తో అభిషేకం చేశారు. ఫ‌లిత‌గా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, ఈ విజ‌యం త‌ర్వాత‌.. ఇప్పుడు తాజాగా కొన్ని కొన్ని విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఇవే.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీని క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. బీజేపీ పాల‌న‌తో విసిగిపోయిన‌.. కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా కూట‌ములు క‌ట్టి.. బీజేపీకి వ్య‌తిరేకంగా అంత‌ర్గ‌త ప్ర‌చారం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయాల‌ని ఆయా వ‌ర్గాల మ‌ద్య పిలుపులు ఇచ్చారు. దీంతో బీజేపీకే తెలియ‌కుండా.. జ‌రిగిన ఈ అంత‌ర్గ‌త‌.. అంత‌ర్లీన ప్ర‌చారంతో ఆ పార్టీ మ‌ట్టి క‌రిచింద‌ని అంటున్నారు.

నిజానికి క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యానికి  కారణం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కారణమని కొందరు, కాంగ్రెస్ మీద ప్రజల అభిమానం కారణమని కొందరు, బీజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత, దేశవ్యాప్త బీజెపి విధానాలపట్ల వ్యతిరేకత కారణమని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఫలితాల్లోంచి ఎవరికి ఇష్టమైన కారణాన్ని వారు వెతుక్కుంటున్నారు. అయితే ఈ ఫలితాల వెనక కొందరి  శ్రమ, మత రాజకీయాల పట్ల వారికున్న వ్యతిరేకత, 6 నెలల పాటు 5 వేల మంది చేసిన‌ కృషి ఉన్నాయ‌ని తాజాగా వెలుగు చూసింది.

నిజానికి వీరెవ‌రూ కూడా పార్టీల‌కు సంబంధించిన వారు కాద‌ని స‌మాచారం. కర్నాటకలో బీజేపీ మత రాజకీయాలు, అవినీతి, దోపిడీ, ఒంటెత్తు పోక‌డ‌లతో రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయడంతో విసిగిపోయిన కొందరు మేదావులు, లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ‌ రంగాల ప్రజలు, అనేక స్వచ్చంద సంస్థలు చేతులు కలిపి సాగించిన పోరాటఫలితంగానే బీజేపీ మ‌ట్టి క‌రిచింద‌ని చెబుతున్నారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. పార్టీల‌కు అతీ తంగా లాయ‌ర్లు, చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు, మేధావి వ‌ర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా కూట‌ములు క‌ట్టి.. వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని.. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌ని కొంద‌రు అంటున్నారు. ఇదే జ‌రిగితే.. వైసీపీ ప‌రిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యంపై వైసీపీలోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా..  రాజ‌కీయాల‌క‌న్నా.. ప్ర‌జ‌ల విల్ ప‌వ‌ర్ గొప్ప‌ద‌నే విష‌యం క‌ర్నాట‌క‌లో తేలిపోయిన ద‌రిమిలా.. ఏపీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Satya

Recent Posts

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

2 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

3 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

4 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

4 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

5 hours ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

5 hours ago