ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ పేరుకే వైరి పక్షాలు అన్నది చాలామంది అనే మాట. జగన్ సర్కారుతో లోపాయకారీ ఒప్పందాలతో బీజేపీ పని చేస్తోందని.. వీరి మధ్య పరస్పర సహకారం ఉందని.. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం.. ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం చేయరనే విమర్శలు గట్టిగానే వినిపిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్.. వైసీపీ నేతలు, అలాగే జగన్ సర్కారు గురించి తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానిని ఆయన గట్టిగానే టార్గెట్ చేశారు. నాని లాంటి నేతలను జైలుకు పంపిస్తామని సునీల్ హెచ్చరించడం విశేషం.
గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సునీల్ మాట్లాడుతూ.. జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అన్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని.. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతోందని సునీల్ వ్యాఖ్యానించారు. జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే అని.. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారని సునీల్ విమర్శించారు.
సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయని.. ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయని… ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయని సునీల్ ఎద్దేవా చేశారు. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తున్నాయని… భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుందని ఆయన విమర్శించారు. ఇంత తీవ్ర స్థాయిలో వైసీపీని బీజేపీ నేత విమర్శించిన నేపథ్యంలో వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు ఉంటాయో చూడాలి.
This post was last modified on May 18, 2023 3:53 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…