ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ పేరుకే వైరి పక్షాలు అన్నది చాలామంది అనే మాట. జగన్ సర్కారుతో లోపాయకారీ ఒప్పందాలతో బీజేపీ పని చేస్తోందని.. వీరి మధ్య పరస్పర సహకారం ఉందని.. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం.. ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం చేయరనే విమర్శలు గట్టిగానే వినిపిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్.. వైసీపీ నేతలు, అలాగే జగన్ సర్కారు గురించి తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానిని ఆయన గట్టిగానే టార్గెట్ చేశారు. నాని లాంటి నేతలను జైలుకు పంపిస్తామని సునీల్ హెచ్చరించడం విశేషం.
గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సునీల్ మాట్లాడుతూ.. జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అన్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని.. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతోందని సునీల్ వ్యాఖ్యానించారు. జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే అని.. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారని సునీల్ విమర్శించారు.
సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయని.. ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయని… ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయని సునీల్ ఎద్దేవా చేశారు. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తున్నాయని… భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుందని ఆయన విమర్శించారు. ఇంత తీవ్ర స్థాయిలో వైసీపీని బీజేపీ నేత విమర్శించిన నేపథ్యంలో వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు ఉంటాయో చూడాలి.
This post was last modified on May 18, 2023 3:53 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…