Political News

వ‌చ్చేది కురుక్షేత్రం.. గెలిచేది పాండ‌వులే

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలను ఆయ‌న కురు క్షేత్ర సంగ్రామంగా అబివ‌ర్ణించారు. ఈ కురుక్షేత్రంలో కౌరవ వధ చేసి.. గెలిచేది పాండ‌వులేన‌ని అన్నారు. అంతేకాదు.. మళ్లీ గౌర వంగా అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. నవంబరు, డిసెంబరుల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ చూస్తున్నారని, రేపు ఎన్నికలు పెట్టినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’ కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ పట్నం జిల్లా పెందుర్తిలో రోడ్ షో నిర్వహించారు.

అనంతరం సభలో ప్రజలనుద్దేశించి చంద్ర‌బాబు ప్రసగించారు. జగన్మోహన్‌రెడ్డి వద్ద ధన బలం ఉంటే, తమ వద్ద ప్రజా బలం ఉంద న్నారు. డబ్బును అడ్డంగా పెట్టుకుని రెచ్చిపోవద్దని, గెలిచేది టీడీపీయేనని… గెలిపించేది ప్రజలేనని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు 5 శాతం భూమిని రిజర్వు చేశానని చంద్ర‌బాబు చెప్పారు. కానీ ఈ సైకో ముఖ్య మంత్రి ఇప్పుడు ఒకే చోట వేయి ఎకరాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తానంటూ పేదలను మోసం చేస్తున్నాడని, వాళ్ల ఉసురు తగలక మానదని హెచ్చరించారు.

సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి తప్ప.. దేనికీ పనికిరాదని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “రాష్ట్రాన్ని సైకో ముఖ్య మంత్రి పాలిస్తున్నాడు. వైసీపీకే చెందిన ఎంపీ రఘురామకృ ష్ణంరాజును సీఐడీ అధికారులతో కొట్టించాడు. ఆయన బాధపడుతుంటే వీడియో తీయించి చూసి ఆనందం పొందిన గొప్ప సైకో. మొన్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుటుంబాన్ని వేధించారు. ఫిర్యాదు ఇచ్చేవాళ్లూ వాళ్లే.. విచారణ చేసేవాళ్లు, చివరకు ఇబ్బందులు పెట్టేవాళ్లు కూడా వైసీపీ వాళ్లే. బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసి నాపై నెట్టే యత్నం చేశారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

జగన్ సైకో కాదని నిరూపించుకోవాల‌ని చంద్ర‌బాబు స‌వాల్ రువ్వారు. “ఒక కన్ను రెండో కన్నును పొడుస్తుందా అన్నాడు. ఒక బాబాయిని చంపి.. మరో బాబాయిని జైలుకు పంపించాడు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక కోసం మీటింగ్ పెట్టిన జగన్.. తన బాబాయి గుండెపోటుతో చనిపోయినట్లు అజేయ కల్లం తదితరుల సమక్షంలో వెల్లడించాడు. గుండెపోటు అని ఆయనకు ఎలా తెలిసింది?” అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. త‌న‌కు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇడుపులపాయ, కడప, పులివెందుల్లో ప్యాలెస్‌లు లేవని చెప్పారు. అద్దె ఇంట్లో ఉంటున్నాను.. అద్దె కడుతున్నానని చెబుతున్నప్పటికీ క్విడ్ ప్రో కో జరిగిందంటున్నారని అన్నారు. రింగురోడ్డు పేరుతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసాన్ని ఈ సైకో కొనసాగిస్తున్నాడని బాబు మండిప‌డ్డారు.

This post was last modified on May 18, 2023 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

26 minutes ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

45 minutes ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

2 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

2 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

3 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

3 hours ago