Political News

అమరావతిలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నారు. దీంతో రైతులు, అమరావతి జేఏసీ నేతలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గొడవలు అవుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి తామిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామంటే తాము అంగీకరించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు.

కొన్ని గ్రామాల పరిధిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం వేస్తున్న లే అవుట్ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. యంత్రాంగం పట్టాల పంపిణీకి వీలుగా భూమిని చదును చేస్తుంటే రైతులు ఆ భూమిని తవ్వేస్తున్నారు. సుప్రింకోర్టులో కేసు విషయం తేలేంత వరకు ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. యంత్రాంగం మొత్తం ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ పనులను తాము చేసుకుని వెళుతున్నారు.

దీంతో రైతులు, జేఏసీ నేతలు యంత్రాంగంపై మండిపోతున్నారు. పెట్రోలు, కిరోసిన్ నింపిన సీసాలను ఆందోళనకారులు అధికార యంత్రాగానికి చూపిస్తున్నారు. పనులు ఆపకపోతే తాము వీటిని ఉపయోగించాల్సొస్తుందని పదేపదే వార్నింగులిస్తున్నారు. తమ భూములను తమిష్టంలేకుండా ప్రభుత్వం ప్లాట్లుగా ఎలా మారస్తుందంటు అధికారులను రైతులు నిలదీస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఎలా పంపిణీ చేస్తుందంటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దొండపాడు గ్రామం ప్రాంతంలో లేఅవుట్లు వేయటానికి అధికారులు తీసుకొచ్చిన జేసీబీలను రైతులు అడ్డుకుని వెనక్కు పంపేశారు.

తమ విధులను అడ్డుకుంటున్నారనే కారణంతో కొందరు రైతులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. యంత్రాంగం చేసిన ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదుచేశారు. అధికారులను పెట్రోలు సీసాలతో బెదిరించినందుకు కూడా కేసులు బుక్ చేశారు. పట్టాల పంపిణీకి అధికారులు మొత్తం 25 లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారు. నిడమర్రు, కృష్ణాయపాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, మందడం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ప్రభుత్వం 50 వేల పట్టాల పంపిణీకి రెడీ అవుతోంది. అమరావతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోకి వచ్చే పేదలకు ఈనెల 18వ తేదీన పట్టాలను పంపిణీ చేయబోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on May 16, 2023 12:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

31 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago