Political News

అమరావతిలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నారు. దీంతో రైతులు, అమరావతి జేఏసీ నేతలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గొడవలు అవుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి తామిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామంటే తాము అంగీకరించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు.

కొన్ని గ్రామాల పరిధిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం వేస్తున్న లే అవుట్ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. యంత్రాంగం పట్టాల పంపిణీకి వీలుగా భూమిని చదును చేస్తుంటే రైతులు ఆ భూమిని తవ్వేస్తున్నారు. సుప్రింకోర్టులో కేసు విషయం తేలేంత వరకు ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. యంత్రాంగం మొత్తం ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ పనులను తాము చేసుకుని వెళుతున్నారు.

దీంతో రైతులు, జేఏసీ నేతలు యంత్రాంగంపై మండిపోతున్నారు. పెట్రోలు, కిరోసిన్ నింపిన సీసాలను ఆందోళనకారులు అధికార యంత్రాగానికి చూపిస్తున్నారు. పనులు ఆపకపోతే తాము వీటిని ఉపయోగించాల్సొస్తుందని పదేపదే వార్నింగులిస్తున్నారు. తమ భూములను తమిష్టంలేకుండా ప్రభుత్వం ప్లాట్లుగా ఎలా మారస్తుందంటు అధికారులను రైతులు నిలదీస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఎలా పంపిణీ చేస్తుందంటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దొండపాడు గ్రామం ప్రాంతంలో లేఅవుట్లు వేయటానికి అధికారులు తీసుకొచ్చిన జేసీబీలను రైతులు అడ్డుకుని వెనక్కు పంపేశారు.

తమ విధులను అడ్డుకుంటున్నారనే కారణంతో కొందరు రైతులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. యంత్రాంగం చేసిన ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదుచేశారు. అధికారులను పెట్రోలు సీసాలతో బెదిరించినందుకు కూడా కేసులు బుక్ చేశారు. పట్టాల పంపిణీకి అధికారులు మొత్తం 25 లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారు. నిడమర్రు, కృష్ణాయపాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, మందడం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ప్రభుత్వం 50 వేల పట్టాల పంపిణీకి రెడీ అవుతోంది. అమరావతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోకి వచ్చే పేదలకు ఈనెల 18వ తేదీన పట్టాలను పంపిణీ చేయబోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on May 16, 2023 12:40 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

16 mins ago

`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని…

22 mins ago

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

2 hours ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

3 hours ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

3 hours ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

4 hours ago