Political News

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. సుప్రీం కోర్టు తాజా ఆదేశం ఇదే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డంపై.. తీవ్ర వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఆర్-5 జోన్‌‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఇటీవ‌ల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. అమ‌రావ‌తి వ్యాజ్యాల‌పై ఇచ్చే తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని సూచించింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఇక్క‌డ ఇళ్లు కేటాయించే ప‌నిని ముమ్మ‌రం చేసింది.

దీంతో రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా సుప్రీంకోర్టులో ఈ పిటిష‌న్ల‌పై విచారణ జ‌రిగింది. అయితే.. ఇక్క‌డ కూడా.. రైతుల‌కు వెంట‌నే ఎలాంటి ఊర‌ట ల‌భించ‌లేదు. అమ‌రావ‌తి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసును క‌లిపి వినాల‌ని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. దీనిపై రైతుల తరపున వాద‌న‌ సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహ‌త్గి, శ్యాం దివాన్, దేవ్ దత్ కామత్ వాదనలు వినిపించారు.

అయితే అమరావతి కేసుతో పాటు ఆర్‌-5 జోన్‌ కేసును కలిపి విచారణ జరపాలని నిర్ణయిస్తూ.. అమ‌రావ‌తి కేసును విచారిస్తు న్న జ‌స్టిస్ జోసెఫ్ ధ‌ర్మాస‌నం ముందు ఆర్-5 జోన్ పిటిష‌న్‌ను బ‌దిలీ చేయాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది. శుక్ర‌వారం లోగానే రెండు పిటీష‌న్ల‌పై విచార‌ణ‌కు జ‌స్టిస్ జోసెఫ్ ధ‌ర్మాస‌నం ముందు లిస్ట్ చేయాల‌ని రిజ‌స్ట్రీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆర్‌- 5 జోన్‌పై త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కూ స్టే ఇవ్వాల‌ని రైతుల తరపు న్యాయవాది హ‌రీశ్ సాల్వే సుప్రీంను కోరగా దీనికి సుప్రీం కోర్టు అంగీక‌రించ‌లేదు.

అమ‌రావ‌తి పిటిష‌న్ పెండింగ్‌లో ఉన్నందునే హైకోర్టు ఆర్- 5 జోన్ పై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది నిరంజ‌న్‌రెడ్డి ఉన్నత న్యాయ‌స్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ -5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను రైతులు కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు సుప్రీం కోర్టుకు తెలిపారు.

కాగా.. ఆర్‌-5 జోన్‌పై రైతులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్లను తాజాగా ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ల వ్య‌వ‌హారం మ‌రింత కాక‌రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 15, 2023 10:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణ – ఆరు గంటల అసలైన సవాల్

ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…

2 hours ago

ఈ ‘మగ’ బుద్ధికి కన్న బిడ్డలు బలి

సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…

2 hours ago

మోసం మాటున ‘డెకాయిట్’ ప్రేమకథ

విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…

2 hours ago

శోభన్ సోదరులకు మంచి టైమ్ వచ్చినట్టే

సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…

3 hours ago

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

6 hours ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

7 hours ago