తాజా కర్ణాటక ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కలిసి వచ్చింది. కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కర్ణాటకలో 7 జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగింది. వాటిలో 15 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
నిజానికి ఈ నియోజకవర్గాలు బీజేపీ, జేడీఎస్ కంచుకోటలు. మైసూరు జిల్లాలో 5, తుముకూరు జిల్లాలో 4, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో 2 చొప్పున, చామరాజనగర జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాహుల్గాంధీ యాత్ర నిర్వహించారు. ఈ 20 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 5 స్థానా లకే పరిమితమవ్వగా బీజేపీ 9 స్థానాలు, జేడీఎస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని 15 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 2 స్థానాలకు, జేడీఎస్ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. మాండ్యా, చిత్రదుర్గ, చామరాజనగర జిల్లాల్లో యాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ జోడో యాత్ర కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపడమే కాకుండా కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగించింది. ఈ ఏడు జిల్లాల్లో 51 అసెంబ్లీ స్థానాలు ఉండగా 36 చోట్ల కాంగ్రె స్ విజయం సాధించింది. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను కన్నడిగులు తిప్పికొట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on May 14, 2023 12:12 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…