తాజా కర్ణాటక ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కలిసి వచ్చింది. కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కర్ణాటకలో 7 జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగింది. వాటిలో 15 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
నిజానికి ఈ నియోజకవర్గాలు బీజేపీ, జేడీఎస్ కంచుకోటలు. మైసూరు జిల్లాలో 5, తుముకూరు జిల్లాలో 4, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో 2 చొప్పున, చామరాజనగర జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాహుల్గాంధీ యాత్ర నిర్వహించారు. ఈ 20 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 5 స్థానా లకే పరిమితమవ్వగా బీజేపీ 9 స్థానాలు, జేడీఎస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని 15 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 2 స్థానాలకు, జేడీఎస్ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. మాండ్యా, చిత్రదుర్గ, చామరాజనగర జిల్లాల్లో యాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ జోడో యాత్ర కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపడమే కాకుండా కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగించింది. ఈ ఏడు జిల్లాల్లో 51 అసెంబ్లీ స్థానాలు ఉండగా 36 చోట్ల కాంగ్రె స్ విజయం సాధించింది. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను కన్నడిగులు తిప్పికొట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on May 14, 2023 12:12 pm
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…