Political News

కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర‌ నియోజ‌క‌వ‌ర్గాలన్నీ కాంగ్రెస్ కే !!

తాజా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర క‌లిసి వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌లో రాహుల్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కర్ణాటకలో 7 జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు రాహుల్ భార‌త్ జోడో యాత్ర సాగింది. వాటిలో 15 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గాలు బీజేపీ, జేడీఎస్‌ కంచుకోటలు. మైసూరు జిల్లాలో 5, తుముకూరు జిల్లాలో 4, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్లారి, రాయచూర్‌ జిల్లాల్లో 2 చొప్పున, చామరాజనగర జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ యాత్ర నిర్వహించారు. ఈ 20 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 5 స్థానా లకే పరిమితమవ్వగా బీజేపీ 9 స్థానాలు, జేడీఎస్‌ 6 స్థానాలు గెలుచుకున్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గణనీయంగా పుంజుకుని 15 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 2 స్థానాలకు, జేడీఎస్‌ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. మాండ్యా, చిత్రదుర్గ, చామరాజనగర జిల్లాల్లో యాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. భారత్‌ జోడో యాత్ర కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపడమే కాకుండా కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగించింది. ఈ ఏడు జిల్లాల్లో 51 అసెంబ్లీ స్థానాలు ఉండగా 36 చోట్ల కాంగ్రె స్‌ విజయం సాధించింది. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను కన్నడిగులు తిప్పికొట్టారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

This post was last modified on May 14, 2023 12:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Rahul Gandhi

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

1 hour ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

3 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

8 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

8 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

9 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

9 hours ago