Political News

కరోనా కోసం చేరితే.. అగ్నికి ఆహుతయ్యారు

దురదృష్టం అంటే ఇదే. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలై.. దాన్నుంచి కోలుకునేందుకు ఆసుపత్రిలో చేరితే అక్కడ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం. అహ్మదాబాద్‌లోని కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న శ్రేయ ఆసుపత్రి ఐసీయూ వార్డులో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ‌ ఆసుపత్రిలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి.

అవి ఐసీయూ వార్డుకు పాకడం.. అక్కడున్న రోగులు నిస్సహాయ స్థితిలో మంటల్లో చిక్కుకోవడం నిమిషాల్లోనే ఎనిమిది మంది అగ్నికి ఆహుతి కావడం జరిగిపోయాయి. కొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసే లోపే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

మంటలు చెలరేగగానే బయటకు పరుగులు తీయడంతో సిబ్బంది, రోగులు చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 40 మంది రోగులను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం విజయ్ ‌రూపాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పీఎం సహాయనిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆసుపత్రి ముందు మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. కోవిడ్‌కు చికిత్స కోసం వస్తే ఇలా ప్రాణాలు కోల్పోవడమేంటని వాళ్లు గుండెలవిసేలా రోదించారు.

This post was last modified on August 6, 2020 6:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

55 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago