ఏపీలో పోలీసులు ఎంత అకృత్యంగా వ్యవహరిస్తున్నారో.. ఎంత దారణంగా వ్యవహరిస్తున్నారో.. ఇప్పటి వరకు చెప్పుకోవడమే తెలుసు. కానీ.. ఇప్పుడు తాజాగా తెరమీదకి వచ్చిన ఓ ఫొటో ఏపీలో ప్రజాస్వామ్యం, నిబంధనలు ఏవిధంగా పోలీసుల బూటు కాళ్ల కింద నలుగుతున్నాయో.. స్పష్టంగా చెబుతోందని అంటున్నారు బీజేపీ నాయకులు. తాజాగా సీఎం జగన్ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను కలుసుకుని. స్థానిక సమస్యలు విన్నవించుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడిని పోలీసులు రెండు కాళ్ల మధ్య పెట్టి నలిపేసిన ఘటన వెలుగు చూసింది.
ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కావలిలో బిజెపి నేతల పై పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తూ ఒక భయానక వాతావారణాన్ని సృష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెడితే పోలీసులు బిజెపి నేతలు పై వ్యవహరించిన తీరు చూస్తే రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదన్నట్లుగా కనపడుతోందన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురి పై దాడికి పాల్పడ్డారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసులు బిజెపి నేతలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే బిజెపి తన కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఆవిధంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తామని వైసీపి ప్రభుత్వాన్ని సోము వీర్రాజు హెచ్చరించారు. బిజెపి నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు.
ప్రజాస్వామ్యవ్యవస్ధలో ప్రభుత్వానికి సమస్యలు చెబుతామని, ఆ దిశగానే ముఖ్యమంత్రికి.. ఎమ్మెల్యేల అరచాకాలు తెలియ చేయడానికి వెడితే ఒబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సురేష్ ను పోలీసులు బూటుకాళ్లతో తన్నిన సంఘటన చూస్తే రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తున్నట్లుగా ఉందన్నారు. బిజెపి నేతలను బూటు కాళ్ళతో తన్నిన పోలీసులపై కేసు నమోదు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
This post was last modified on May 12, 2023 9:53 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…