ఏపీలో పోలీసులు ఎంత అకృత్యంగా వ్యవహరిస్తున్నారో.. ఎంత దారణంగా వ్యవహరిస్తున్నారో.. ఇప్పటి వరకు చెప్పుకోవడమే తెలుసు. కానీ.. ఇప్పుడు తాజాగా తెరమీదకి వచ్చిన ఓ ఫొటో ఏపీలో ప్రజాస్వామ్యం, నిబంధనలు ఏవిధంగా పోలీసుల బూటు కాళ్ల కింద నలుగుతున్నాయో.. స్పష్టంగా చెబుతోందని అంటున్నారు బీజేపీ నాయకులు. తాజాగా సీఎం జగన్ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను కలుసుకుని. స్థానిక సమస్యలు విన్నవించుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడిని పోలీసులు రెండు కాళ్ల మధ్య పెట్టి నలిపేసిన ఘటన వెలుగు చూసింది.
ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కావలిలో బిజెపి నేతల పై పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తూ ఒక భయానక వాతావారణాన్ని సృష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెడితే పోలీసులు బిజెపి నేతలు పై వ్యవహరించిన తీరు చూస్తే రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదన్నట్లుగా కనపడుతోందన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురి పై దాడికి పాల్పడ్డారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసులు బిజెపి నేతలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే బిజెపి తన కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఆవిధంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తామని వైసీపి ప్రభుత్వాన్ని సోము వీర్రాజు హెచ్చరించారు. బిజెపి నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు.
ప్రజాస్వామ్యవ్యవస్ధలో ప్రభుత్వానికి సమస్యలు చెబుతామని, ఆ దిశగానే ముఖ్యమంత్రికి.. ఎమ్మెల్యేల అరచాకాలు తెలియ చేయడానికి వెడితే ఒబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సురేష్ ను పోలీసులు బూటుకాళ్లతో తన్నిన సంఘటన చూస్తే రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తున్నట్లుగా ఉందన్నారు. బిజెపి నేతలను బూటు కాళ్ళతో తన్నిన పోలీసులపై కేసు నమోదు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…