Political News

అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామని అధికార పార్టీ వైసీపీ అంటోంది. మరోవైపు, అమరావతి రాజధాని అని రైతులు వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటికే అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు సగం పూర్తయ్యాయని విపక్ష టీడీపీ చెబుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో, సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల అమలుపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ కో ఇవ్వాలని, ఆగస్టు 14 వరకు ఆ వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

రాజధాని పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ రాజధాని నిర్మాణం కోసం రూ.52వేల కోట్ల విలువైన నిర్మాణాలు చేపట్టారని తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంత…? ఆయా నిర్మాణాలు ఏ దశలో ఆగిపోయాయి….అన్న వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఆ నిర్మాణాలు ప్రజాధనంతో నిర్మించినవని, అవి అర్ధంతరంగా ఆగిపోతే రాష్ట్ర ఖజానాకు నష్టమేనని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ఎన్ని బిల్డింగ్‌లు పూర్తయ్యాయి..? ఏ దశలో ఉన్నాయి…కాంట్రాక్టర్లకు ఇంకా ఎంత డబ్బు చెల్లించాలన్న వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

రాజధాని తరలిస్తే…ఇప్పటికే ఉన్న పూర్తయిన భవనాలు నిరుపయోగమవుతాయని….వాటిని వాడుకోకపోతే అవి పాడైపోతాయని హైకోర్టు అభిప్రాయపడింది. అటువంటి పక్షంలో ఆ నిర్మాణాల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

ఆ నిర్మాణాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను సమర్పించాలని రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

This post was last modified on August 9, 2020 7:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

28 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago