ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామని అధికార పార్టీ వైసీపీ అంటోంది. మరోవైపు, అమరావతి రాజధాని అని రైతులు వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటికే అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు సగం పూర్తయ్యాయని విపక్ష టీడీపీ చెబుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో, సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల అమలుపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ కో ఇవ్వాలని, ఆగస్టు 14 వరకు ఆ వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
రాజధాని పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ రాజధాని నిర్మాణం కోసం రూ.52వేల కోట్ల విలువైన నిర్మాణాలు చేపట్టారని తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంత…? ఆయా నిర్మాణాలు ఏ దశలో ఆగిపోయాయి….అన్న వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఆ నిర్మాణాలు ప్రజాధనంతో నిర్మించినవని, అవి అర్ధంతరంగా ఆగిపోతే రాష్ట్ర ఖజానాకు నష్టమేనని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ఎన్ని బిల్డింగ్లు పూర్తయ్యాయి..? ఏ దశలో ఉన్నాయి…కాంట్రాక్టర్లకు ఇంకా ఎంత డబ్బు చెల్లించాలన్న వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
రాజధాని తరలిస్తే…ఇప్పటికే ఉన్న పూర్తయిన భవనాలు నిరుపయోగమవుతాయని….వాటిని వాడుకోకపోతే అవి పాడైపోతాయని హైకోర్టు అభిప్రాయపడింది. అటువంటి పక్షంలో ఆ నిర్మాణాల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ఆ నిర్మాణాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను సమర్పించాలని రాష్ట్ర అకౌంటెడ్ జనరల్కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
This post was last modified on August 9, 2020 7:42 am
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…