నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా నిండా అవే ఫొటోలు.. వీడియోలు. లెబనాన్ రాజధాని బేరూత్లో జరిగిన భారీ పేలుడు తాలూకు దృశ్యాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 100 మందికిపైగా చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించిన తాజా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు.
అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరం భవనాలు కుప్పకూలాయి. చాలా భవనాలు వివిధ స్థాయిల్లో ధ్వంసమయ్యాయి. అనేక రకాల నిర్మాణాలు, వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇంకా అనేక రకాలుగా నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ముందు చిన్న స్థాయిలో పేలుడు జరిగి దట్టమైన పొగ కమ్ముకోవడం కనిపించింది. చాలామంది దాని వీడియోను చిత్రీకరిస్తుంటే.. మరో భారీ పేలుడు సంభవించి కిలోమీటర్ల దూరం మొత్తం నాశనమైంది. ఇలా వీడియోలు తీస్తున్న చాలామంది ప్రమాదానికి గురయ్యారు.
కనీసం పది కిలోమీటర్ల దూరం ఈ పేలుడు ప్రభావం ఉందంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హిరోషిమా నాగసాకిల మీద ప్రయోగించిన అణుబాంబు ప్రభావంలో నాలుగోవంతు స్థాయిలో ఈ పేలుడు ప్రభావం ఉన్నట్లు నిపుణులు చెబుతుండటం గమనార్హం.
ఇంతకీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని శోధిస్తున్నారు. బీరట్ పోర్టులో 2750 టన్నుల ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్ రసాయనాన్ని ఆరేళ్లుగా ఏ రక్షణా లేకుండా నిల్వ చేసి ఉంచారని.. అదిప్పుడు పేలుడుకు కారణమై పెను విధ్వంసానికి దారి తీసిందని చెబతున్నారు.
This post was last modified on August 6, 2020 10:51 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…