నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా నిండా అవే ఫొటోలు.. వీడియోలు. లెబనాన్ రాజధాని బేరూత్లో జరిగిన భారీ పేలుడు తాలూకు దృశ్యాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 100 మందికిపైగా చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించిన తాజా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు.
అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరం భవనాలు కుప్పకూలాయి. చాలా భవనాలు వివిధ స్థాయిల్లో ధ్వంసమయ్యాయి. అనేక రకాల నిర్మాణాలు, వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇంకా అనేక రకాలుగా నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ముందు చిన్న స్థాయిలో పేలుడు జరిగి దట్టమైన పొగ కమ్ముకోవడం కనిపించింది. చాలామంది దాని వీడియోను చిత్రీకరిస్తుంటే.. మరో భారీ పేలుడు సంభవించి కిలోమీటర్ల దూరం మొత్తం నాశనమైంది. ఇలా వీడియోలు తీస్తున్న చాలామంది ప్రమాదానికి గురయ్యారు.
కనీసం పది కిలోమీటర్ల దూరం ఈ పేలుడు ప్రభావం ఉందంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హిరోషిమా నాగసాకిల మీద ప్రయోగించిన అణుబాంబు ప్రభావంలో నాలుగోవంతు స్థాయిలో ఈ పేలుడు ప్రభావం ఉన్నట్లు నిపుణులు చెబుతుండటం గమనార్హం.
ఇంతకీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని శోధిస్తున్నారు. బీరట్ పోర్టులో 2750 టన్నుల ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్ రసాయనాన్ని ఆరేళ్లుగా ఏ రక్షణా లేకుండా నిల్వ చేసి ఉంచారని.. అదిప్పుడు పేలుడుకు కారణమై పెను విధ్వంసానికి దారి తీసిందని చెబతున్నారు.
This post was last modified on August 6, 2020 10:51 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…