నిన్న మొన్నటి వరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా పటాపంచలు అవుతున్నాయా? ఏమో.. హంగ్ వస్తుం దేమో.. ఏమో.. కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందేమో.. అన్న ముందస్తు సర్వేలు ఇప్పుడు మళ్లీ తెల్ల మొహం వేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నవా రు. మరో రెండు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. నిన్న మొన్నటి వరకు పెద్దగా హడావుడి కనిపించని బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది.
బీజేపీ అగ్రనేత,ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్షాలు రంగంలోకి దిగిపోయారు. అదేసమ యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ప్రజలకు చేరువయ్యారు. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రచారంలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు రెండు రోజుల ముందు… కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. కనీ వినీ ఎరుగని రీతిలో బీజేపీ కార్యకర్తలు జనాలను ఈ షోకు తరలించారు.
అంతేకాదు… ఏకంగా 26 కిలో మీటర్లు సాగిన రోడ్ షోలో రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలు.. ప్రధానికి అపూర్వ స్వాగతం పలకడం గమనార్హం. మరోవైపు.. అమిత్షా కూడా పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని.. కాంగ్రెస్ను పాయింట్లవారీగా ఏకేస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి భక్తులను టార్గెట్ చేయడం.. తాజాగా ఎన్నికల్లో కీలక పరిణామంగా మారింది. వీరికి తోడు.. యూపీ సీఎం యోగి కూడా.. ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఆయన కూడా.. కర్ణాటకలోని కొన్ని జిల్లాలను టార్గెట్గా చేసుకుని విజృంభిస్తున్నారు. దీంతో అనూహ్యం గా కర్ణాటకలో సమీకరణలు మారుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉండడంతో.. ఆదివారం, సోమవారం ఈ ప్రచార జోరు మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. నేతలు.. గతంలో మాదిరిగా రియాక్ట్ కాలేక పోతున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న రెండు కీలక విషయాలు.. ఇప్పుడు కాంగ్రెస్కు అడ్డంకిగా మారాయి.
This post was last modified on May 8, 2023 6:59 am
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…
విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…
సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…