నిన్న మొన్నటి వరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా పటాపంచలు అవుతున్నాయా? ఏమో.. హంగ్ వస్తుం దేమో.. ఏమో.. కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందేమో.. అన్న ముందస్తు సర్వేలు ఇప్పుడు మళ్లీ తెల్ల మొహం వేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నవా రు. మరో రెండు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. నిన్న మొన్నటి వరకు పెద్దగా హడావుడి కనిపించని బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది.
బీజేపీ అగ్రనేత,ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్షాలు రంగంలోకి దిగిపోయారు. అదేసమ యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ప్రజలకు చేరువయ్యారు. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రచారంలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు రెండు రోజుల ముందు… కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. కనీ వినీ ఎరుగని రీతిలో బీజేపీ కార్యకర్తలు జనాలను ఈ షోకు తరలించారు.
అంతేకాదు… ఏకంగా 26 కిలో మీటర్లు సాగిన రోడ్ షోలో రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలు.. ప్రధానికి అపూర్వ స్వాగతం పలకడం గమనార్హం. మరోవైపు.. అమిత్షా కూడా పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని.. కాంగ్రెస్ను పాయింట్లవారీగా ఏకేస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి భక్తులను టార్గెట్ చేయడం.. తాజాగా ఎన్నికల్లో కీలక పరిణామంగా మారింది. వీరికి తోడు.. యూపీ సీఎం యోగి కూడా.. ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఆయన కూడా.. కర్ణాటకలోని కొన్ని జిల్లాలను టార్గెట్గా చేసుకుని విజృంభిస్తున్నారు. దీంతో అనూహ్యం గా కర్ణాటకలో సమీకరణలు మారుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉండడంతో.. ఆదివారం, సోమవారం ఈ ప్రచార జోరు మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. నేతలు.. గతంలో మాదిరిగా రియాక్ట్ కాలేక పోతున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న రెండు కీలక విషయాలు.. ఇప్పుడు కాంగ్రెస్కు అడ్డంకిగా మారాయి.
This post was last modified on May 8, 2023 6:59 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…