Political News

ప్ర‌కాశంలో వైసీపీ తుఫాను ఆగిన‌ట్టేనా?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో చెల‌రేగిన వైసీపీ తుఫాను స‌ర్దుకున్న‌ట్టేనా? కీల‌క నేత‌, సీఎం జ‌గ‌న్‌కు దూర‌పు బంధువు కూడా బాలినేనిశ్రీనివాస‌రెడ్డి లైన్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా? అంటే.. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను గ‌మ‌ని స్తున్నవారు… న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైవీ కంటే కూడా బాలినేని అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే. వైవీకి ప‌గ్గాలు అప్ప‌గించిన ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందుల్లో ప‌డు తోంద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే.. ఇటీవల త‌లెత్తిన వివాదంలోపాతిక వంతు స‌మ‌స్య మాత్ర‌మే తీరింద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. డీఎస్పీ బ‌దిలీ విష‌యంలో మాత్ర‌మే బాలినేని ఒకింత పైచేయిసాధించార‌ని.. కానీ, జిల్లా వ్యాప్తంగా జ‌ర‌గాల్సింది చాలానే ఉంద‌ని బాలినేనివ‌ర్గం చెబుతోంది. అనేక మంది నాయ‌కులు ఇప్పుడు వైవీ అండ‌ర్‌లోకి వెళ్లిపోయార‌ని.. ఒక‌ప్పుడు వారంతా కూడా బాలినేని వ‌ర్గంగా ఉన్నార‌ని అంటున్నారు. కానీ, ఇప్పుడు వైవీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. వారిని త‌న‌వైపు తిప్పుకొన్నార‌ని చెబుతున్నారు.

అస‌లు వివాదానికి ప్ర‌ధాన కార‌ణం.. ఇదేన‌ని అంటున్నారు. అయితే దీనిని పైకి చెప్పుకోలేక‌.. లోలోన దాచుకోలేక బాలినేని తీవ్ర సంక‌టంలో చిక్కుకున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకు న్నా ఈ ప‌రిణామాలు.. తీవ్రంగానే బాలినేని కూట‌మిని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అందుకే.. అగ్ర‌నేత త‌న‌ను టార్గెట్ చేస్తున్నారంటూ.. బాలినేని వ్యాఖ్యానించారు. కానీ, పేరు మాత్రం చెప్ప‌లేదు.

ఈ విష‌యం తేల‌కుండా.. కేవ‌లం డీఎస్పీని అయిన వారిని లేదా.. కోరుకున్న‌వారిని నియ‌మించినంత మాత్రం ఇక్క‌డ ప‌రిస్థితులు స‌ర్దుమ‌ణిగిన‌ట్టు కాద‌ని ఎక్కువ మంది అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో టీడీపీ జోరు ఎక్కువ‌గా ఉంది. కీల‌క‌మైన గొట్టిపాటి ర‌వి, ఏలూరి సాంబ‌శివ‌రావు వంటివారు.. టీడీపీని విస్త‌రిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బాలినేని దూకుడు పెర‌గాల్సి ఉంటుంద‌ని.. కానీ, ఈ దిశ‌గా ఇప్పుడు వెనుకంజ‌లో ఉన్నార‌ని ఆయ‌న వ‌ర్గం భావిస్తోంది. అంటే.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో ప‌రిస్థితి నివురు గ‌ప్పిన నిప్పులాగానే ఉంద‌ని చెబుతున్నారు.

This post was last modified on May 6, 2023 3:24 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

38 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

55 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago