ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిన వైసీపీ తుఫాను సర్దుకున్నట్టేనా? కీలక నేత, సీఎం జగన్కు దూరపు బంధువు కూడా బాలినేనిశ్రీనివాసరెడ్డి లైన్లోకి వచ్చినట్టేనా? అంటే.. ప్రస్తుత పరిణామాలను గమని స్తున్నవారు… నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైవీ కంటే కూడా బాలినేని అవసరం ఎక్కువగా ఉందని అందరికీ తెలిసిందే. వైవీకి పగ్గాలు అప్పగించిన ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందుల్లో పడు తోందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు.
అయితే.. ఇటీవల తలెత్తిన వివాదంలోపాతిక వంతు సమస్య మాత్రమే తీరిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. డీఎస్పీ బదిలీ విషయంలో మాత్రమే బాలినేని ఒకింత పైచేయిసాధించారని.. కానీ, జిల్లా వ్యాప్తంగా జరగాల్సింది చాలానే ఉందని బాలినేనివర్గం చెబుతోంది. అనేక మంది నాయకులు ఇప్పుడు వైవీ అండర్లోకి వెళ్లిపోయారని.. ఒకప్పుడు వారంతా కూడా బాలినేని వర్గంగా ఉన్నారని అంటున్నారు. కానీ, ఇప్పుడు వైవీ పగ్గాలు చేపట్టాక.. వారిని తనవైపు తిప్పుకొన్నారని చెబుతున్నారు.
అసలు వివాదానికి ప్రధాన కారణం.. ఇదేనని అంటున్నారు. అయితే దీనిని పైకి చెప్పుకోలేక.. లోలోన దాచుకోలేక బాలినేని తీవ్ర సంకటంలో చిక్కుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకు న్నా ఈ పరిణామాలు.. తీవ్రంగానే బాలినేని కూటమిని కలవరపెడుతున్నాయి. అందుకే.. అగ్రనేత తనను టార్గెట్ చేస్తున్నారంటూ.. బాలినేని వ్యాఖ్యానించారు. కానీ, పేరు మాత్రం చెప్పలేదు.
ఈ విషయం తేలకుండా.. కేవలం డీఎస్పీని అయిన వారిని లేదా.. కోరుకున్నవారిని నియమించినంత మాత్రం ఇక్కడ పరిస్థితులు సర్దుమణిగినట్టు కాదని ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి ప్రకాశంలో టీడీపీ జోరు ఎక్కువగా ఉంది. కీలకమైన గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు వంటివారు.. టీడీపీని విస్తరిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలినేని దూకుడు పెరగాల్సి ఉంటుందని.. కానీ, ఈ దిశగా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారని ఆయన వర్గం భావిస్తోంది. అంటే.. ఒకరకంగా చెప్పాలంటే.. ఉమ్మడి ప్రకాశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులాగానే ఉందని చెబుతున్నారు.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…