ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిన వైసీపీ తుఫాను సర్దుకున్నట్టేనా? కీలక నేత, సీఎం జగన్కు దూరపు బంధువు కూడా బాలినేనిశ్రీనివాసరెడ్డి లైన్లోకి వచ్చినట్టేనా? అంటే.. ప్రస్తుత పరిణామాలను గమని స్తున్నవారు… నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైవీ కంటే కూడా బాలినేని అవసరం ఎక్కువగా ఉందని అందరికీ తెలిసిందే. వైవీకి పగ్గాలు అప్పగించిన ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందుల్లో పడు తోందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు.
అయితే.. ఇటీవల తలెత్తిన వివాదంలోపాతిక వంతు సమస్య మాత్రమే తీరిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. డీఎస్పీ బదిలీ విషయంలో మాత్రమే బాలినేని ఒకింత పైచేయిసాధించారని.. కానీ, జిల్లా వ్యాప్తంగా జరగాల్సింది చాలానే ఉందని బాలినేనివర్గం చెబుతోంది. అనేక మంది నాయకులు ఇప్పుడు వైవీ అండర్లోకి వెళ్లిపోయారని.. ఒకప్పుడు వారంతా కూడా బాలినేని వర్గంగా ఉన్నారని అంటున్నారు. కానీ, ఇప్పుడు వైవీ పగ్గాలు చేపట్టాక.. వారిని తనవైపు తిప్పుకొన్నారని చెబుతున్నారు.
అసలు వివాదానికి ప్రధాన కారణం.. ఇదేనని అంటున్నారు. అయితే దీనిని పైకి చెప్పుకోలేక.. లోలోన దాచుకోలేక బాలినేని తీవ్ర సంకటంలో చిక్కుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకు న్నా ఈ పరిణామాలు.. తీవ్రంగానే బాలినేని కూటమిని కలవరపెడుతున్నాయి. అందుకే.. అగ్రనేత తనను టార్గెట్ చేస్తున్నారంటూ.. బాలినేని వ్యాఖ్యానించారు. కానీ, పేరు మాత్రం చెప్పలేదు.
ఈ విషయం తేలకుండా.. కేవలం డీఎస్పీని అయిన వారిని లేదా.. కోరుకున్నవారిని నియమించినంత మాత్రం ఇక్కడ పరిస్థితులు సర్దుమణిగినట్టు కాదని ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి ప్రకాశంలో టీడీపీ జోరు ఎక్కువగా ఉంది. కీలకమైన గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు వంటివారు.. టీడీపీని విస్తరిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలినేని దూకుడు పెరగాల్సి ఉంటుందని.. కానీ, ఈ దిశగా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారని ఆయన వర్గం భావిస్తోంది. అంటే.. ఒకరకంగా చెప్పాలంటే.. ఉమ్మడి ప్రకాశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులాగానే ఉందని చెబుతున్నారు.
This post was last modified on May 6, 2023 3:24 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…