ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మొదటి నుంచి ఆగమ్య గోచరంగానే ఉంది. ఎవరి పంచనో చేరి నాలుగు సీట్లు సంపాందించుకుని ఎంజాయ్ చేయడం మినహా సొంత బలం పై ఎప్పుడూ గెలిచింది లేదు. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు.
ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఒక సీటు కూడా లేదు కదా…. 2024 ఎన్నికల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వాకబు చేశారు. దానికి అంత సీన్ లేదని కొందరు నేతలు కుండబద్దలు కొట్టారట. వచ్చే ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాదని మోదీ మొహానే వాళ్లు చెప్పేశారట. ఏమిటీ ఒక్క సీటు కూడా రాదా అని అడుగుతూ మోదీ ఆశ్చర్యపోయారట.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు కుమర్ రాజు ఈ సంగతి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా మోదీ దగ్గరే చెప్పెయ్యాల్సిన దీన స్థితిలోకి పార్టీ వచ్చిందని విష్ణు కుమార్ రాజు వాపోయారు. పైగా జగన్ను ఓడించి తీరాల్సిందేనని లేని పక్షంలో మరింత అరాచకం ప్రబలుతుందని విష్ణు అంటున్నారు. పైగా విశాఖ రాజధాని తమ అజెండా కాదని కూడా విష్ణు తేల్చేశారు.
This post was last modified on May 5, 2023 7:22 am
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…