ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మొదటి నుంచి ఆగమ్య గోచరంగానే ఉంది. ఎవరి పంచనో చేరి నాలుగు సీట్లు సంపాందించుకుని ఎంజాయ్ చేయడం మినహా సొంత బలం పై ఎప్పుడూ గెలిచింది లేదు. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు.
ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఒక సీటు కూడా లేదు కదా…. 2024 ఎన్నికల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వాకబు చేశారు. దానికి అంత సీన్ లేదని కొందరు నేతలు కుండబద్దలు కొట్టారట. వచ్చే ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాదని మోదీ మొహానే వాళ్లు చెప్పేశారట. ఏమిటీ ఒక్క సీటు కూడా రాదా అని అడుగుతూ మోదీ ఆశ్చర్యపోయారట.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు కుమర్ రాజు ఈ సంగతి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా మోదీ దగ్గరే చెప్పెయ్యాల్సిన దీన స్థితిలోకి పార్టీ వచ్చిందని విష్ణు కుమార్ రాజు వాపోయారు. పైగా జగన్ను ఓడించి తీరాల్సిందేనని లేని పక్షంలో మరింత అరాచకం ప్రబలుతుందని విష్ణు అంటున్నారు. పైగా విశాఖ రాజధాని తమ అజెండా కాదని కూడా విష్ణు తేల్చేశారు.
This post was last modified on May 5, 2023 7:22 am
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…