ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మొదటి నుంచి ఆగమ్య గోచరంగానే ఉంది. ఎవరి పంచనో చేరి నాలుగు సీట్లు సంపాందించుకుని ఎంజాయ్ చేయడం మినహా సొంత బలం పై ఎప్పుడూ గెలిచింది లేదు. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు.
ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఒక సీటు కూడా లేదు కదా…. 2024 ఎన్నికల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వాకబు చేశారు. దానికి అంత సీన్ లేదని కొందరు నేతలు కుండబద్దలు కొట్టారట. వచ్చే ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాదని మోదీ మొహానే వాళ్లు చెప్పేశారట. ఏమిటీ ఒక్క సీటు కూడా రాదా అని అడుగుతూ మోదీ ఆశ్చర్యపోయారట.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు కుమర్ రాజు ఈ సంగతి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా మోదీ దగ్గరే చెప్పెయ్యాల్సిన దీన స్థితిలోకి పార్టీ వచ్చిందని విష్ణు కుమార్ రాజు వాపోయారు. పైగా జగన్ను ఓడించి తీరాల్సిందేనని లేని పక్షంలో మరింత అరాచకం ప్రబలుతుందని విష్ణు అంటున్నారు. పైగా విశాఖ రాజధాని తమ అజెండా కాదని కూడా విష్ణు తేల్చేశారు.
This post was last modified on May 5, 2023 7:22 am
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…