ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మొదటి నుంచి ఆగమ్య గోచరంగానే ఉంది. ఎవరి పంచనో చేరి నాలుగు సీట్లు సంపాందించుకుని ఎంజాయ్ చేయడం మినహా సొంత బలం పై ఎప్పుడూ గెలిచింది లేదు. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు.
ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఒక సీటు కూడా లేదు కదా…. 2024 ఎన్నికల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వాకబు చేశారు. దానికి అంత సీన్ లేదని కొందరు నేతలు కుండబద్దలు కొట్టారట. వచ్చే ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాదని మోదీ మొహానే వాళ్లు చెప్పేశారట. ఏమిటీ ఒక్క సీటు కూడా రాదా అని అడుగుతూ మోదీ ఆశ్చర్యపోయారట.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు కుమర్ రాజు ఈ సంగతి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా మోదీ దగ్గరే చెప్పెయ్యాల్సిన దీన స్థితిలోకి పార్టీ వచ్చిందని విష్ణు కుమార్ రాజు వాపోయారు. పైగా జగన్ను ఓడించి తీరాల్సిందేనని లేని పక్షంలో మరింత అరాచకం ప్రబలుతుందని విష్ణు అంటున్నారు. పైగా విశాఖ రాజధాని తమ అజెండా కాదని కూడా విష్ణు తేల్చేశారు.
This post was last modified on May 5, 2023 7:22 am
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…